AP Weather: ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..
ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రాబోయే 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆల్రెడీ బలహీనపడింది. ప్రజంట్ తమళనాడు వైపుగా పయనిస్తుంది. దీంతో ఇటు దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో చెదురుమదురు వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు మరో 2 రోజులు కొనసాగే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్, యానాం లలో దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయీలలో తూర్పు / ఈశాన్య గాలులు వీస్తున్నాయి.
రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :
ఉత్తరకోస్తా ఆంధ్రప్రదేశ్:-
ఈ రోజు :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది.
రేపు, ఎల్లుండి :- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
ఈ రోజు, రేపు :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
రాయలసీమ :-
ఈ రోజు, రేపు, ఎల్లుండి :- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
పెరిగిన చలి తీవ్రత
మరోవైపు అటు ఏపీ, ఇటు తెలంగాణలోనూ చలితీవ్రత క్రమంగా పెరుగుతుంది. పలు ప్రాంతాల్లో మంచు కురుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే మార్నింగ్ 9 వరకు మంచు తెరలు వీడటం లేదు. దీంతో పొద్దున్నే పనుల నిమిత్తం బయటకు వెళ్లే వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు.
అరకులో అద్భుత దృశ్యాలు
ప్రశాంత వాతావరణంలో సూర్యోదయాన్ని వీక్షించడం ఎప్పుడూ అద్భుతమైన అనుభవమే. మంచు తెరల్ని చీల్చుకుంటూ లేలేత కిరణాలు నేలను తాకుకుంటే ఆ ఉదయపు దృశ్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవ్. ఇప్పుడు ఇలాంటి ఫీలింగ్ని పదింతలు ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు అరకు వెళ్లిన టూరిస్ట్లు. అక్కడ వంజగి మేఘాల కొండ దగ్గర దూదిపింజల్లా తేలుతున్న మేఘాలు.. వాటిని పైనుంచి చూస్తూ సూర్యోదయాన్ని వీక్షించిన టూరిస్ట్లు ఆ థ్రిల్లింగ్ ఫీలింగ్ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
అల్లూరి జిల్లా ఏజెన్సీలో ఇవాళ పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంది. వీకెండ్ కావడంతో రద్దీ బాగా కనిపిస్తోంది. మాడగడ, వంజంగి మేఘల వ్యూ పాయింట్కి వేలాది మంది టూరిస్ట్లు పోటెత్తారు. ఈ ప్రభావంతో ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరిగింది. అరకులో హోటల్స్, లాడ్జ్లు అన్నీ ఫుల్ అయిపోయాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..