AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

24 గంటల్లోనే రెండో పెళ్లి !

నిన్న ఒకరితో.. నేడు మరొకరితో పెళ్లి. 24 గంటల్లోనే ఓ యువతి రెండు పెళ్లిళ్లు చేసుకున్న వైనం అందరినీ విస్మయపరిచింది. అప్పగింతల సమయంలో ఇంటికి వచ్చిన ప్రియుడిని చూసి నువ్వే కావాలంటూ పెళ్ళికూతురు పట్టు పట్టింది. చేసేదేమీలేక వరుడితో తెగదెంపులు చేసుకుని ప్రియుడితో తన కూతురికి మళ్లీ పెళ్లి చేసింది.

24 గంటల్లోనే రెండో పెళ్లి !
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 14, 2020 | 5:41 PM

Share

నిన్న ఒకరితో.. నేడు మరొకరితో పెళ్లి. 24 గంటల్లోనే ఓ యువతి రెండు పెళ్లిళ్లు చేసుకున్న వైనం అందరినీ విస్మయపరిచింది. వినడానికి వింతగా ఉన్నా ఇది యదార్థం. తన కూతురిని ఒక అయ్య చేతిలో పెట్టాలని ఆ తల్లి ఆశించింది. తెలిసిన వారితో సంబంధం కుదుర్చుకొని బంధువుల సమక్షంలో బిడ్డకు పెళ్లి జరిపించింది. అప్పగింతల సమయంలో ఇంటికి వచ్చిన ప్రియుడిని చూసి నువ్వే కావాలంటూ పెళ్ళికూతురు పట్టు పట్టింది. చేసేదేమీలేక వరుడితో తెగదెంపులు చేసుకుని ప్రియుడితో తన కూతురికి మళ్లీ పెళ్లి చేసింది. నల్లగొండజిల్లా కనగల్‌ మండలం కురంపల్లికి చెందిన పద్మ కూతురు మౌనిక కు హైదరాబాద్ కు చెందిన యుకుడితో వివాహం జరిపించింది. బంధువుల సమక్షంలో తన కూతురి పెళ్లి జరగడంతో ఆ తల్లి ఎంతో సంతోషపడింది. వడి బియ్యం పోసి అప్పగింతల సమయంలో మౌనిక ప్రియుడు రాజు సీన్ లోకి వచ్చాడు. గతంలో మౌనిక సమీప బంధువు దేవరకొండ మండలం గోనబోయినపల్లి కి చెందిన రాజుతో ప్రేమాయణం సాగించింది. మౌనిక తల్లి మాత్రం హైదరాబాద్ కు చెందిన యువకుడితో పెండ్లి చేసింది. అప్పగింతల సమయంలో అక్కడికి వచ్చిన ప్రియుడు రాజును చూసి బోరున విలపిస్తూ నువ్వే కావాలంటూ పెళ్లి కూతురు మౌనిక పట్టు పట్టింది. ఈ సీన్ తో షాక్ తిన్న వరుడి బంధువులు పోలీసులను ఆశ్రయించారు. ఇరు వర్గాల పెద్దలకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు పంచాయితీని తెగదెంపులు చేశారు. నవ వరుడితో తెగదెంపులు చేసిన 24 గంటల్లోనే పెద్దల సమక్షంలోనే ప్రేమించినవాడితో ధర్వేశిపురం రేణుక ఎల్లమ్మ ఆలయంలో మళ్లీ పెళ్లి జరిపించారు.