AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సచివాలయంలో పెరుగుతున్న కరోనా కేసులు.. మొత్తం తొమ్మిది మందికి.!

ఏపీ సచివాలయంలో కరోనా విజృంభణ ఆగడం లేదు. తాజాగా మరో ఐదుగురు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సచివాలయంలోని ఉద్యోగుల్లో 750 మందికి పరీక్షలు చేయగా,

సచివాలయంలో పెరుగుతున్న కరోనా కేసులు.. మొత్తం తొమ్మిది మందికి.!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 06, 2020 | 4:16 PM

Share

ఏపీ సచివాలయంలో కరోనా విజృంభణ ఆగడం లేదు. తాజాగా మరో ఐదుగురు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సచివాలయంలోని ఉద్యోగుల్లో 750 మందికి పరీక్షలు చేయగా, వారిలో ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో సచివాలయంలో పాజిటివ్ కేసుల సంఖ్య తొమ్మిదికి చేరింది. అందులో రెవెన్యూ, ఆర్టీజీఎస్‌, మున్సిపల్, అసెంబ్లీ విభాగాల్లో పనిచేసే వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో సచివాలయంలోని 1, 2వ బ్లాకుల్లో పనిచేసే ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేస్తున్నారు. అలాగే బ్లాక్‌ 3, అసెంబ్లీలో పనిచేసే ఉద్యోగుల శాంపిళ్లను తీసుకుంటున్నారు. కాగా సచివాలయంలో ఇదివరకే రెండు కేసులు నమోదైన విషయం తెలిసిందే. మరోవైపు కరోనా నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను విధించింది. సచివాలయ ఉద్యోగులు కచ్చితంగా ఆరోగ్య సేతు యాప్‌ని వేసుకోవాలని సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,588కు చేరింది. అందులో 2323 మంది కోలుకోగా, 73 మంది మరణించారు. ప్రస్తుతం 1192 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 741 మందికి కరోనా నిర్ధారణ అవ్వగా.. వారిలో 467 మంది ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. అలాగే ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో 131 మందికి కరోనా పాజిటివ్‌ రాగా.. అందులో నలుగురు కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 4లక్షలకు పైన పరీక్షలు నిర్వహించారు.

Read This Story Also: బస్‌ ఛార్జీల చెల్లింపుల్లో తెలంగాణ ప్రభుత్వం వినూత్న ఆలోచన..!