AP CRIME: ఆటో బోల్తా.. ఇద్దరు మృతి.. పోలీసుల బెదిరింపులే కారణమా..
కాయాకష్టం చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న వారిని రోడ్డు ప్రమాదం(Road Accident) రూపంలో మృత్యువు కబళించింది. ప్లాస్టిక్ బుట్టలు అమ్ముకునే ఇద్దరు మహిళలు..
కాయాకష్టం చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న వారిని రోడ్డు ప్రమాదం(Road Accident) రూపంలో మృత్యువు కబళించింది. ప్లాస్టిక్ బుట్టలు అమ్ముకునే ఇద్దరు మహిళలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడటంతో ఈ దారుణ ఘటన జరిగింది. అనంతపురం(Anantapur) జిల్లాలోని తనకల్లులో షేక్ మస్తాన్, బత్తలపల్లిలో వలీసాబ్ కుటుంబాలు నివాసముంటున్నాయి. వీరు ప్లాస్టిక్ బుట్టలు అమ్ముతూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఓ వాహనంలో ప్లాస్టిక్ బుట్టలు పెట్టుకుని హిందూపురం బయల్దేరారు. మార్గమధ్యంలో చెర్లోపల్లి సమీపానికి చేరుకోగానే వీరు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మస్తాన్ భార్య నన్నీబీ, వలీసాబ్ భార్య హుస్సేన్బీ అక్కడికక్కడే మృతి చెందారు. ముందువైపు కూర్చున్న మస్తాన్, వలీసాబ్లు ప్రమాదం నుంచి బయట పడ్డారు. సమాచారం అందుకున్న హిందూపురం పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మరోవైపు.. ప్లాస్టిక్ బుట్టలను మంగళవారం గోరంట్లలో విక్రయించి అక్కడే చెట్ల కింద రాత్రి విశ్రమించాలని అనుకున్నట్లు బాధితులు తెలిపారు. ఐతే కొత్తవారు ఉండరాదంటూ పోలీసులు హెచ్చరించడంతో హిందూపురానికి బయలుదేరామని పేర్కొన్నారు. పోలీసుల హెచ్చరికతో భయపడి ఆందోళనతో వాహనాన్ని నడపడంతో ఈ ప్రమాదం జరిగిందని కన్నీటిపర్యంతమయ్యారు.
Also Read
Covid: బిల్ గేట్స్ ల్యాబ్లోనే కరోనా పుట్టింది.. సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ సంచలన ప్రకటన..