AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు ఏనుగులు మృతి చెందాయి.. అసలు ఏం జరిగిందంటే..

chittoor distirct: గంటావారి పల్లె సమీపంలోని పంట పొలాల్లో ఏనుగు విద్యుత్ షాక్ కు గురైంది. వెంకట స్వామి అనే రైతు పొలంలో విద్యుద్ఘాతానికి గురైన ఏనుగు ట్రాన్స్ ఫార్మర్ ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగినట్లు అటవీ శాఖ సిబ్బంది భావిస్తోంది. గత కొన్ని రోజులుగా సదుం మండలంలోని పంట పొలాల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపు నుంచి విడిపోయిన ఏనుగే విద్యుత్ షాక్ కు గురై మృతి చెందినట్లు అటవీ శాఖ భావిస్తోంది.

Andhra Pradesh: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు ఏనుగులు మృతి చెందాయి.. అసలు ఏం జరిగిందంటే..
Two Elephants Dies
Raju M P R
| Edited By: |

Updated on: Nov 08, 2023 | 10:06 AM

Share

చిత్తూరు జిల్లా, నవంబర్08; తిరుపతి ఎస్వీ జూపార్క్ లో అటవీ శాఖ రెస్క్యూ చేసిన ఏనుగు మృతి చెందగా మరో ఏనుగు సదుం మండలంలోని పంట పొలాల్లో విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది. తిరుపతి ఎస్వీ జూ పార్కులో 17 ఏళ్ల మగ ఏనుగు మృతి చెందినట్లు జూ పార్క్ యంత్రాంగం స్పష్టం చేసింది. గత ఆగస్టు చివరి వారంలో చిత్తూరు- తమిళనాడు సరిహద్దులో పంట పొలాల పై దాడులు చేసి ముగ్గురు రైతుల మృతికి ఏనుగు కారణమైంది. రెండు నెలల క్రితం చిత్తూరు రూరల్ మండలం కట్టకిందపల్లి వద్ద ఏనుగును రెస్క్యూ చేసిన అటవీ శాఖ తిరుపతి ఎస్వీ జూకు తరలించింది. ఏనుగును బంధించిన రెస్క్యూటీం అటవీశాఖ ఎస్వీ జూ వైద్యుల పర్యవేక్షణలో ఉంచింది.

గాయాలతో చికిత్స పొందుతున్న ఏనుగు నిన్న మృతి చెందింది. జూ లోని సంరక్షణ కేంద్రంలో ఉన్న గోడలు, చెట్లను తొండంతో కొట్టుకుని ఈ ఏనుగు గాయపడిందని చెప్పారు. అయితే, గాయం నయం కాలేదని, చికిత్స పొందుతూనే ఏనుగు మృతి చెందినట్లు జూ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

మరోవైపు, సదుం మండలం గంటావారి పల్లె సమీపంలోని పంట పొలాల్లో ఏనుగు విద్యుత్ షాక్ కు గురైంది. వెంకట స్వామి అనే రైతు పొలంలో విద్యుద్ఘాతానికి గురైన ఏనుగు ట్రాన్స్ ఫార్మర్ ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగినట్లు అటవీ శాఖ సిబ్బంది భావిస్తోంది. గత కొన్ని రోజులుగా సదుం మండలంలోని పంట పొలాల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపు నుంచి విడిపోయిన ఏనుగే విద్యుత్ షాక్ కు గురై మృతి చెందినట్లు అటవీ శాఖ భావిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే