Andhra: బయట ఫుడ్ తినే అలవాటు ఉందా.? ఇది చూస్తే జన్మలో మళ్లీ ముట్టుకోరు
టీవీ9 స్టింగ్ ఆపరేషన్తో ఏపీలో జంతు ఆయిల్ దందా బయటపడుతోంది. నిన్న ఏలూరులో జంతు ఆయిల్ మాఫియాను బయటపెట్టిన టీవీ9.. ఇప్పుడు గుంటూరు జిల్లా మంగళగిరిలోనూ రహస్యంగా నడుస్తోన్న యానియల్ ఆయిల్ దందాను వెలుగులోకి తీసుకొచ్చింది. కంప్లీట్ డిటైల్స్ చూద్దాం. ఆ వివరాలు ఇలా..

మంగళగిరిలోనూ జంతు కళేబరాల వంట నూనె కలకలం రేపింది. టీవీ9 నిఘాలో జంతువుల వంట నూనె దందా బయటపడింది. 15 కేజీల జంతు ఆయిల్ రూ.1500కి ముఠా అమ్ముతోంది. రెండు రకాలుగా జంతు కళేబరాల వంట ఆయిల్ తయారీ చేస్తున్నారు. చచ్చిన జంతువుల కళేబరాలతో ఒకరకమైన వంట ఆయిల్.. మాంసం కోసం చంపిన జంతువుల వ్యర్థాలతో మరో ఆయిల్ ఉంది. జంతు కొవ్వు, ఎముకలతో ఆయిల్ ముఠా తయారు చేస్తోంది. బిర్యానీలు, నూడిల్స్లో ఎక్కువగా వాడుతున్నారంటున్న తయారీదారులు.. ఇళ్ల దగ్గరే తయారుచేసి రహస్యంగా ముఠా అమ్ముతోంది. హోటల్స్ వాళ్లు ఎక్కువగా తీసుకెళ్తారంటున్నారు తయారీదారులు.
ఏదో కుటీర పరిశ్రమ అన్నట్టుగా ఇళ్ల దగ్గరే ఈ జంతు ఆయిల్ను తయారు చేస్తున్నారు. జంతు కళేబరాలు, కొవ్వుతో ఆయిల్ తీస్తున్నారు. ఇళ్ల ముందే పెద్దపెద్ద పాత్రల్లో జంతు వ్యర్థాలను ఉడికిస్తూ యానిమల్ వంటనూనె తయారు చేస్తున్నారు. మంగళగిరిలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోన్న జంతు ఆయిల్ దందాపై టీవీ9 స్టింగ్ ఆపరేషన్ చేపట్టింది. జంతు కళేబరాల వంట నూనెను ఎలా అమ్ముతున్నారో చూడండి. యానిమల్ ఆయిల్ను రెండు రకాలుగా తయారుచేస్తోంది ముఠా. చచ్చిన జంతువుల కళేబరాలతో ఒకరకమైన ఆయిల్.. మాంసం కోసం చంపిన జంతువుల వ్యర్థాలతో మరో ఆయిల్ తయారు చేస్తున్నారు. ఈ రెండు ఆయిల్స్ కలర్స్లో భారీ తేడాలు ఉంటాయి. మొదటిది చిక్కగా థిక్ కలర్లో ఉంటే.. రెండోది అచ్చం రెగ్యులర్ ఆయిల్స్ మాదిరిగానే ఉంటుందంటున్నారు తయారీదారులు. యానిమల్ ఆయిల్ దందా సీక్రెట్గా చేస్తారంటోంది ఓ మహిళ. ఎక్కడెక్కడ.. ఎవరు అమ్ముతున్నారో క్లారిటీగా చెప్పింది.
