AP CM Jagan: ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు.. అప్రమత్తమైన సర్కార్.. నేడు ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష..

AP CM Jagan: ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారి.. సరికొత్త వేరియంట్ ఒమిక్రాన్ గా సరికొత్త రూపం సంతరించుకుంది. దక్షిణాఫ్రికాలో మొదట వెలుగులోకి..

AP CM Jagan: ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు.. అప్రమత్తమైన సర్కార్.. నేడు ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష..
Cm Jagan
Follow us

|

Updated on: Dec 13, 2021 | 6:58 AM

AP CM Jagan: ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారి.. సరికొత్త వేరియంట్ ఒమిక్రాన్ గా సరికొత్త రూపం సంతరించుకుంది. దక్షిణాఫ్రికాలో మొదట వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ క్రమంగా వివిధ దేశాలకు వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒమిక్రాన్ వేరియంట్ తొలికేసు నమోదయ్యింది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. ఈరోజు ఉదయం సీఎం జగన్ వైద్య ఆరోగ్య శాఖ పై  సమీక్షనిర్వహించనున్నారు.

తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగే సమీక్షకు హాజరుకానున్న మంత్రి ఆళ్ళ నాని, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో సీఎం నాడు-నేడు పనులు, కొత్తగా ఏర్పాటు చేయబోతున్న మెడికల్ కాలేజీల పనులు పురోగతి పై సమీక్షించనున్నారు.

రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఒమిక్రాన్ తోలి కేసు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఐర్లాండ్ నుంచి వ్యక్తికీ ఒమిక్రాన్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ వ్యాక్సినేషన్ పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది.

Also Read:

 గ్రాముకి ఒక రూపాయి తగ్గిన పసిడి ధర, స్థిరంగా కొనసాగుతున్న వెండి ధరలు..