రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. పట్టాలెక్కనున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్.. ఎప్పటి నుంచంటే.?

Krishna Express Train: కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా రద్దైన రైళ్లు తిరిగి ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. ఒక్కొక్కటిగా రద్దు చేయబడిన...

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. పట్టాలెక్కనున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్.. ఎప్పటి నుంచంటే.?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 25, 2021 | 9:40 AM

Krishna Express Train: కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా రద్దైన రైళ్లు తిరిగి ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. ఒక్కొక్కటిగా రద్దు చేయబడిన ట్రైన్స్‌ను రైల్వేశాఖ పట్టాలెక్కిస్తోంది. ఈ నేపధ్యంలోనే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ తీపికబురు అందించింది. తిరుపతి- ఆదిలాబాద్ మధ్య నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఈ నెల 27వ తేదీ నుంచి పట్టాలెక్కనున్నట్లు స్పష్టం చేసింది. సుమారు 10 నెలల తర్వాత ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్న ఈ రైలు మొత్తం 59 స్టేషన్లలో ఆగుతుంది.

ఈ రైలు ప్రతీ రోజూ ఉదయం 5.50 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి మల్కాజిగిరి రాత్రి 9 గంటలకు.. ఆదిలాబాద్ మరుసటి రోజు ఉదయం 6.15 గంటలకు చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ఆదిలాబాద్ నుంచి రాత్రి 9.05 గంటలకు బయల్దేరి.. మల్కాజిగిరికి మరుసటి రోజు ఉదయం 5.15 గంటలకు.. అదే రోజు రాత్రి 9.35 గంటలకు తిరుపతి చేరుతుంది.

కాగా, సికింద్రాబాద్‌-మణుగూరు-సికింద్రాబాద్‌ (నెం.02745/02746), కాచిగూడ-యల్హంక-కాచిగూడ (నెం.07603/07604), గుంటూరు-రాయగడ-గుంటూరు (నెం.07244/07243), కాకినాడపోర్టు-తిరుపతి-కాకినాడపోర్టు (నెం.07249/07250) రైళ్లను సైతం రైల్వే శాఖ 27,28,29 నుంచి ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకురానుంది.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు