AP News: దొంగల బీభత్సం.. ఇంట్లోకి చొరబడి.. అడ్డొచ్చిన వృద్ధుడిని చంపిన దొంగలు
ఈమధ్య కాలంలో దొంగలు చెలరేగిపోతున్నారు. ఎవరికి భయపడకుండా అడ్డు వచ్చిన వారిపై దాడి చేయడం, అవసరం అయితే చంపేసి చోరీకి పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటననే ఒక్కటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

Thieves Killed An Old Man In Rajolu
ఈ మధ్య కాలంలో దొంగలు ఎక్కువయ్యారు. మనుషులను బురిడీ కొట్టించి డబ్బులు దండుకుంటున్నారు. రాజోలులో దొంగలు బీభత్సం సృష్టించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు (మం) పొన్నమండ గ్రామంలో మెడబల జగ్గారావు(85) ఏళ్ల వృద్ధుడిని గుర్తుతెలియని దండుగులు హతమార్చి బంగారం నగదును దొంగిలించారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దండుగులు ఎవరు అనేదిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన గూర్చి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
