RRR Case : సుప్రీంలో నర్సాపురం ఎంపీ అరెస్ట్ కేసు విచారణ మధ్యాహ్నం 2.30కి వాయిదా, రఘురామ తనయుడు మరో పిటిషన్

Raghu rama Krishna raju Case : పశ్చిమగోదావరిజిల్లా నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు అరెస్ట్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో..

RRR Case : సుప్రీంలో నర్సాపురం ఎంపీ అరెస్ట్ కేసు  విచారణ మధ్యాహ్నం 2.30కి వాయిదా, రఘురామ తనయుడు మరో పిటిషన్
RRR
Follow us

|

Updated on: May 21, 2021 | 1:50 PM

Raghu rama Krishna raju Case : పశ్చిమగోదావరిజిల్లా నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు అరెస్ట్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఇవాళ కీలక విచారణ జరుగుతోంది. ఇప్పటికే రఘురామరాజు మెడికల్ రిపోర్టులు సుప్రీం కోర్టుకు చేరాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు.. ఎంపీ రఘురామ కృష్ణరాజు కేసు విషయంలో ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తుందన్న దానిపై రాజకీయవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇలాఉంటే, సుప్రీం కోర్టు ఈ కేసు విచారణను మధ్యాహ్నం 2.30కి వాయిదా వేసింది. మరోవైపు, రఘురామరాజు తనయుడు భరత్‌ సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశారు. కస్టడీలో తన తండ్రి మీద దాడిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు నిర్వహించాలని ఆయన అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. సీబీఐ లేదా ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరిపించాలన్న భరత్‌.. ప్రతివాదులుగా సీఎం జగన్‌, సీబీసీఈఐడీ అధికారులను చేర్చారు. దర్యాప్తులో దోషులుగా తేలిన వారిపై కేసులు నమోదు చేసేలా ఆదేశించాలని పిటిషన్‌ లో పేర్కొన్నారు. కాగా, రఘురామ రాజు కేసుకు సంబంధించి సుప్రీం న్యాయమూర్తులు వినీత్‌శరణ్‌, బీఆర్‌ గగాయ్‌ నేతృత్వంలో విచారణ జరుగుతోంది.

Read also : Covid ayurveda medicine : ‘ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందుకు అడ్డం పడొద్దు..’ రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి సోమిరెడ్డి వినతి

Latest Articles
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!