AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఘటన తెలిసి షాక్‌కి గురయ్యా: కేటీఆర్

విశాఖపట్నంలోని విషవాయువు లీక్ ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ షాక్‌ అయినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఈ ఘటనపై ఆయన ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తూ..

ఈ ఘటన తెలిసి షాక్‌కి గురయ్యా: కేటీఆర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 07, 2020 | 10:44 AM

Share

విశాఖపట్నంలోని విషవాయువు లీక్ ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ షాక్‌ అయినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఈ ఘటనపై ఆయన ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తూ.. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అందరూ తొందరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు కేటీఆర్. అలాగే మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు కేటీఆర్.

కాగా విశాఖలో ఫార్మా కంపెనీ ప్రమాదంపై సీఎం జగన్ ఆరా తీశారు. గ్యాస్ లీక్ ప్రమాద ఘటన వివరాలు కలెక్టర్‌ని అడిగి తెలుసుకున్నారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో జగన్‌ వైజాగ్ వెళ్లనున్నారు. 11.45 నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఆయన వైజాగ్ వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకూ ఆరుగురు మృతి చెందగా, 80 మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.

Read More:

మీ అకౌంట్‌లో రూ.1500 పడలేదా? అయితే ఈ నెంబర్‌కి కాల్ చేయండి!

హీరోయిన్ తండ్రిని కత్తితో బెదిరించి.. ఫోన్ లాక్కెళ్లిన దొంగలు

బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసుపై శ్రీముఖి రియాక్షన్