AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kanipakam: కాణిపాకంలో తెలంగాణ భక్తుల సందడి.. ఆశ్చర్యంతో అలాగే చూస్తుండిపోయిన స్థానికులు.. అసలు మ్యాటర్ ఏంటంటే..

Kanipakam Vinayaka Temple: చిత్తూరు జిల్లాలోని వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ భక్త బృందం..

Kanipakam: కాణిపాకంలో తెలంగాణ భక్తుల సందడి.. ఆశ్చర్యంతో అలాగే చూస్తుండిపోయిన స్థానికులు.. అసలు మ్యాటర్ ఏంటంటే..
Shiva Prajapati
|

Updated on: Jul 17, 2021 | 9:25 PM

Share

Kanipakam Vinayaka Temple: చిత్తూరు జిల్లాలోని వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ భక్త బృందం శనివారం నాడు కాణిపాకం పుణ్యక్షేత్రానికి చేరుకుంది. తెలంగాణా భక్తులు కాణిపాకం కు రావడంలో ఎలాంటి విశేషం లేకపోయినా.. వారు వచ్చిన వాహనాలే విశేషంగా నిలిచాయి. వారు వచ్చిన వాహనాలను చూసి అక్కడి ప్రజలు, భక్తులు నోరెళ్లబెట్టారంటే అర్థం చేసుకోవచ్చు. శనివారం నాడు సినిమా స్టైల్‌లో కొంతమంది మిత్రుల బృందం తెలంగాణ నుంచి పుదుచ్చేరికి, అక్కడ నుంచి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శనం కోసం చిత్తూరు జిల్లాకు వచ్చారు. అయితే వారు వచ్చింది ఏ కారులోనే.. ట్రావెల్ బస్సులోనే కాదు. కేవలం విదేశాల్లో మాత్రమే లభ్యమైయ్యే హార్లీ డేవిడ్ సన్, బిఎండబ్ల్యు, ఇతర ఫారెన్ కంపెనీలకు చెందిన అత్యంత ఖరీదైన బైక్ లపై వచ్చి సందడి చేశారు. వాటిని ఆలయ పరిధిలో పార్కింగ్ చేసి దైవ దర్శనానికి వెళ్లారు.

అయితే, కాణిపాకంలో నివాసం ఉంటున్న ప్రజలు, దర్శనానికి వచ్చిన భక్తులు ఆ ఫారెన్ మోడల్ బైక్స్ ను ఆసక్తిగా చూశారు. అంతే కాదు వాటిపై కూర్చొని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. దాదాపు 12 కొత్త రకమైన వాహనాలను చూసిన స్థానికులు.. వాటి గురించి రకరకాలుగా వారిలో వారే అంచనాలు వేసుకున్నారు. ఒక్కో దాని విలువ సుమారు రూ. 20 లక్షలంటూ ఉంటుందని కొందరంటే.. రూ. 50 లక్షలంటూ మరికొందరు మాట్లాడేసుకున్నారు. ఇదిలాఉంటే.. హైదరాబాద్‌కు చెందిన స్టార్ట్ అప్ కంపెనీ నిర్వాహకుడైన నరసింహ రావు, అతని మిత్ర బృందం హైదరాబాద్ నుంచి కోయంబత్తూరు, రామేశ్వరం శివాలయం, పుదుచ్చేరి, యాత్రలు ముగించుకొని వరసిద్ధి వినాయక స్వామి దర్శనార్థం వచ్చామని తెలిపారు. కాణిపాకం నుంచి నేరుగా హైదరాబాద్ కు వెళ్తున్నట్లు చెప్పారు. ఏదేమైనా వీరు ఉన్నంతసేపు.. ఆలయానికి వచ్చిన భక్తులు, స్థానిక ప్రజలు వారి బైక్‌లపైనే దృష్టి పెట్టారని చెప్పాలి.

Also read:

Farmers: రాజస్థాన్‌లో రైతును తన్ని, కూతుర్ని ఈడ్చుకెళ్లిన అధికారి.. వీడియో వైరల్‌ అవడంతో మారిన సీన్..

Viral Video: పెళ్లి వేడుకలో వరుడి కునికిపాట్లు.. వధువు పక్కనే ఉన్నా పట్టించుకోని వైనం.. నెట్టింట్లో మస్తీ వీడియో హల్‌చల్..

Telangana Covid Cases: తెలంగాణలో నిలకడగా నమోదవుతున్న కరోనా కేసులు.. తాజాగా ఎన్ని పాజిటివ్ కేసులంటే..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..