AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Crime News: డివైడర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. 15 మందికి గాయాలు..

NTR district: ఏపీలో రహదారులు నెత్తురోడుతున్నాయి. నంద్యాల జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

AP Crime News: డివైడర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. 15 మందికి గాయాలు..
Road Accident
Shaik Madar Saheb
|

Updated on: Apr 18, 2022 | 7:04 AM

Share

NTR district: ఏపీలో రహదారులు నెత్తురోడుతున్నాయి. నంద్యాల జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే మరో ఘటన చోటుచేసుకుంది. ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల (Paritala) వద్ద హైవేపై ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్ అతివేగంతో ఎదురుగా వెళ్తున్న లారీని ఢీకొని.. ఆ తర్వాత డివైడర్‌ (bus hits divider) ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108లో నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమన్వి ట్రావెల్స్ బస్సు విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

Also Read:

Road Accident: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కల్వర్టును ఢీకొన్న స్కార్పియో.. నలుగురి మృతి..

Visakhapatnam: విశాఖలో పెరుగుతున్న భూమి విలువ.. స్మశానాల్లో కూడా ఇల్లులు.. అక్రమాలు చెక్ పెట్టేదిశగా కొత్త వ్యవస్థ