Anantapur district: యాడికి మండల కేంద్రంలో పందుల యజమానుల ఫైటింగ్‌.. స్థానికంగా రచ్చ.. రచ్చ

అనంతపురంజిల్లా యాడికి మండల కేంద్రంలో పందుల యజమానుల ఫైటింగ్‌ రచ్చ రేపింది. యాడికిలో పందుల కారణంగా ప్రజలు రోగాల బారినపడుతున్నారు.

Anantapur district: యాడికి మండల కేంద్రంలో పందుల యజమానుల ఫైటింగ్‌.. స్థానికంగా రచ్చ.. రచ్చ
Pig Owners Fight
Follow us

|

Updated on: Sep 17, 2021 | 1:02 PM

అనంతపురంజిల్లా యాడికి మండల కేంద్రంలో పందుల యజమానుల ఫైటింగ్‌ రచ్చ రేపింది. యాడికిలో పందుల కారణంగా ప్రజలు రోగాల బారినపడుతున్నారు. దీంతో పందుల్ని వేరే ప్రాంతానికి తరలించాలని సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, పంచాయతీ సిబ్బంది నిర్ణయం తీసుకున్నారు. మినీ వ్యాన్‌లో పందులను తరలిస్తుండగా వాటి యజమానులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పందుల్ని వేరే ప్రాంతానికి తరలిస్తే తమకు జీవనోపాధి ఎలా అని ప్రశ్నించారు పందుల యజమానులు. సహనం కోల్పోయి బాటిల్‌లో ఉన్న పెట్రోల్‌ను అక్కడున్న వాళ్లందరిపై చల్లారు. పందుల వ్యాన్‌కి అడ్డంతిరిగి బైఠాయించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం పీక్‌కి వెళ్లింది. బాటిల్‌లో ఉన్న పెట్రోల్‌ పంచాయతీ సిబ్బందిపై చల్లడంతో అక్కడున్న వాళ్లంతా ప్రాణభయంతో పరుగు పెట్టారు. పందుల యజమానుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో పంచాయతీ సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.

కృష్ణా జిల్లా: మద్యం మత్తులో ఘర్షణ.. ఒకరు మృతి

కృష్ణా జిల్లా గుడివాడ రైల్వే స్టేషన్ వద్ద లిక్కర్ తాగిన మైకంలో ఇద్దరు యువకులు మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడు మృతిచెందాడు. పట్టణానికి చెందిన రాపానీ ఏసు, బత్తుల సాయికుమార్​ అనే ఇద్దరు కలిసి రైల్వే స్టేషన్ దగ్గర్లో గురువారం రాత్రి మద్యం సేవించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటలతో మొదలైన గొడవ.. ఇద్దరి మధ్య వాగ్వాదానికి, ఘర్షణకు దారితీసింది. సాయి కుమార్​పై గొడ్డలితో ఏసు దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ సాయికుమార్​ను స్థానిక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం వైద్యులు విజయవాడకు తరలించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయికుమార్ చనిపోయాడు. ఈ ఘటనపై గుడివాడ టూటౌన్​ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read:9 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధించిన ఆయా… 20 ఏళ్ల జైలు శిక్ష

వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజ్‌లో ర్యాగింగ్‌ కలకలం.. ఫస్టియర్ స్టూడెంట్ దుస్తులు విప్పించి

SRHతో మ్యాచ్‌లో అర్ధసెంచరీ దాటేసిన ఆర్సీబీ టాప్-4 బౌలర్లు
SRHతో మ్యాచ్‌లో అర్ధసెంచరీ దాటేసిన ఆర్సీబీ టాప్-4 బౌలర్లు
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
ప్రచారంలోనూ చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ
ప్రచారంలోనూ చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ
హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..
హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!