AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nara Lokesh: గుడ్ మార్నింగ్ మహానటుడు.. చెప్పేవి నీతులు.. దోచేవి గుట్టలు.. కేతిరెడ్డిపై లోకేశ్ సెటైర్లు

చెప్పేవి నీతులు.. దోచేవి గుట్టలు.. గుడ్ మార్నింగ్ మహానటుడు.. అంటూ నారా లోకేశ్.. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డిని టార్గెట్ చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర సత్యసాయి జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలో కొనసాగుతోంది.

Nara Lokesh: గుడ్ మార్నింగ్ మహానటుడు.. చెప్పేవి నీతులు.. దోచేవి గుట్టలు.. కేతిరెడ్డిపై లోకేశ్ సెటైర్లు
Nara Lokesh Mla Kethireddy
Shaik Madar Saheb
|

Updated on: Apr 02, 2023 | 9:39 AM

Share

చెప్పేవి నీతులు.. దోచేవి గుట్టలు.. గుడ్ మార్నింగ్ మహానటుడు.. అంటూ నారా లోకేశ్.. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డిని టార్గెట్ చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర సత్యసాయి జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని లోకేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. చెప్పేవి నీతులు.. దోచేవి గుట్టలు అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం నిర్వహిస్తారని, నిజాయతీగా ఉండాలంటూ ఉద్యోగులకు నీతులు చెబుతుంటారని కానీ చేసే పనులు అలా ఉండవంటూ విమర్శించారు. అందరికీ నీతిని బోధించే ఎమ్మెల్యే కేతిరెడ్డి మాత్రం గుట్టలు ఆక్రమించుకుంటారని లోకేశ్ ఆరోపించారు.

ఎర్రగుట్టను కబ్జా చేసిన కేతిరెడ్డి విలాసవంతమైన ఫాంహౌస్ నిర్మించుకున్నారంటూ నారా లోకేష్ పేర్కొన్నారు. ఇది మరో రుషికొండ అని, ఎమ్మెల్యే విలాసాలకు అడ్డా అని లోకల్ గా టాక్ వినిపిస్తోందని అన్నారు. 902, 909 సర్వే నెంబర్లలో 20 ఎకరాలను ఆక్రమించారని వివరించారు.

ఇవి కూడా చదవండి

ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చెరువులో నిర్మించిన గెస్ట్ హౌస్ డ్రోన్ విజువల్స్ కూడా చూపించారు నారా లోకేష్.. మరి నారా లోకేష్‌ ఆరోపణలపై ఎమ్మెల్యే కేతిరెడ్డి రియాక్షన్‌పై ఉత్కంఠ నెలకొంది.

నారా లోకేష్ ట్వీట్..

మరిన్ని ఏపీ వార్తల కోసం..