నారా లోకేష్‌కు బిగ్ షాక్..!

టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్‌కు భారీ షాక్ తగిలింది. గుంటూరు జిల్లాలో జరిగిన అభివృద్ధి సమీక్ష సమావేశానికి లోకేష్‌కు ఆహ్వానం అందలేదు. ఇక నుంచి జిల్లాలో జరిగే డీఆర్సీ సమావేశానికి లోకేష్‌ను పిలవకూడదని వైసీపీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. సభ్యులు ఆ తీర్మానాన్ని ఆమోదించారు. అయితే గత కొద్ది రోజులు రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య రాజుకున్న వివాదంతోనే జిల్లాకు చెందిన వైసీపీ […]

నారా లోకేష్‌కు బిగ్ షాక్..!
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 23, 2019 | 4:45 PM

టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్‌కు భారీ షాక్ తగిలింది. గుంటూరు జిల్లాలో జరిగిన అభివృద్ధి సమీక్ష సమావేశానికి లోకేష్‌కు ఆహ్వానం అందలేదు. ఇక నుంచి జిల్లాలో జరిగే డీఆర్సీ సమావేశానికి లోకేష్‌ను పిలవకూడదని వైసీపీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. సభ్యులు ఆ తీర్మానాన్ని ఆమోదించారు.

అయితే గత కొద్ది రోజులు రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య రాజుకున్న వివాదంతోనే జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా, నారా లోకేష్ మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.