AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat: ఏపీకి మరో వందే భారత్‌.. కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ!

Vande Bharat: సాధారణ రైళ్లతో పోలిస్తే ఈ వందే భారత్‌లో అధునాతన సదుపాయాలు ఉన్నాయి. టెక్నాలజీతో కూడిన రైలు. ఈ రైలుకు ఇతర రైళ్లకంటే టికెట్‌ ధర ఎక్కువ ఉన్నప్పటికీ డిమాండ్‌ మరింతగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మరికొన్ని వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను నడిపేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది..

Vande Bharat: ఏపీకి మరో వందే భారత్‌.. కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ!
Subhash Goud
|

Updated on: Nov 28, 2024 | 5:13 PM

Share

భారత రైల్వే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని సరికొత్త ట్రైన్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణించే రైల్వేలో హైస్పీడ్‌ రైళ్లను ప్రవేశపెడుతోంది. ఇక ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అన్ని ప్రాంతాలను అనుసంధానం చేసేలా రైల్వే శాఖ చర్యలు చేపడుతోంది. ఈ వందేభారత్‌కు దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. సాధారణ రైళ్లతో పోలిస్తే ఈ వందే భారత్‌లో అధునాతన సదుపాయాలు ఉన్నాయి. టెక్నాలజీతో కూడిన రైలు. ఈ రైలుకు ఇతర రైళ్లకంటే టికెట్‌ ధర ఎక్కువ ఉన్నప్పటికీ డిమాండ్‌ మరింతగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మరికొన్ని వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను నడిపేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది.

ఈ నేపథ్యంలో ఏపీకి మరో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం – తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకురావాలని టీడీపీ ఎంపీ, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ కోరారు. ఈ అంశంపై ఆయన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను సైతం కలిశారు. విశాఖ- తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నడపాలని ఎంపీ మంత్రిని కోరారు. అలాగే దక్షిణ కోస్తా రైల్వే జోన్ నిర్మాణంపై కృతజ్ఞతలు తెలిపారు. వాల్తేరు డివిజన్‌ను అలాగే కొనసాగించాల్సిన అవసరాన్ని కేంద్ర మంత్రికి ఎంపీ వివరించారు. అంతేకాకుండా విశాఖ-బెంగళూరు మధ్య ప్రతి రోజు రైలు నడపాలని కోరారు. రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ శ్రీభారత్‌.. విశాఖ-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు దువ్వాడలో అలాగే చూడాలని కోరారు. ఎంపీ విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇలా అయితే ప్లేఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే.! చేజేతులా SRHకి ఛాన్స్..
ఇలా అయితే ప్లేఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే.! చేజేతులా SRHకి ఛాన్స్..
పచ్చిమిర్చి కడిగేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
పచ్చిమిర్చి కడిగేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
ఆలయ పునరుద్ధరణకు రూ.12కోట్ల విరాళం ప్రకటించిన అనంత్ అంబానీ
ఆలయ పునరుద్ధరణకు రూ.12కోట్ల విరాళం ప్రకటించిన అనంత్ అంబానీ
రహానే నోటి దురుసు.. ఆరోన్ ఫించ్ సీరియస్ వార్నింగ్
రహానే నోటి దురుసు.. ఆరోన్ ఫించ్ సీరియస్ వార్నింగ్
కదిలే రైల్లో అద్భుతం..తోటి ప్రయాణికులే డాక్టర్లై పురుడు పోశారు!
కదిలే రైల్లో అద్భుతం..తోటి ప్రయాణికులే డాక్టర్లై పురుడు పోశారు!
సమ్మర్‌లో కరెంట్ బిల్లు వాచిపోతుందా..? ఈ సింపుట్‌ టిప్స్ పాటిస్తే
సమ్మర్‌లో కరెంట్ బిల్లు వాచిపోతుందా..? ఈ సింపుట్‌ టిప్స్ పాటిస్తే
పాన్ ఇండియా సెన్సేషన్.. ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ?
పాన్ ఇండియా సెన్సేషన్.. ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ?
తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్
తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్
అమ్మమ్మల కాలం ట్రిక్.. నోరూరించే ఊరగాయ ఇలా పెడితే అదిరిపోద్దీ
అమ్మమ్మల కాలం ట్రిక్.. నోరూరించే ఊరగాయ ఇలా పెడితే అదిరిపోద్దీ
బెజవాడలో హైడ్రామా.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ! కారణం తెలిస్తే
బెజవాడలో హైడ్రామా.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ! కారణం తెలిస్తే