ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు

ముప్పాళ్ల : శుక్రవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వెంటనే వివిధ పనుల నిమిత్తం వెళ్లే ఉద్యోగస్తులు, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా పోలింగ్ సమయం ముగిసే సమయానికి 833 ఓట్లకు గానూ 472 ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. మొత్తం 56 శాతం ఓటింగ్ నమోదైనట్లు […]

ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు
Follow us

|

Updated on: Mar 22, 2019 | 6:20 PM

ముప్పాళ్ల : శుక్రవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వెంటనే వివిధ పనుల నిమిత్తం వెళ్లే ఉద్యోగస్తులు, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా పోలింగ్ సమయం ముగిసే సమయానికి 833 ఓట్లకు గానూ 472 ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. మొత్తం 56 శాతం ఓటింగ్ నమోదైనట్లు సమాచారం.