AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నగరి జెండా పండగలో రోజా

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని నగరి నియోజకవర్గంలోని పురపాలక సంఘం కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు ఎమ్మెల్యే రోజా. ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు, త్యాగధనుల ప్రతిఫలంగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని గుర్తు చేశారు ఎమ్మెల్యే రోజా. ఒకసారి స్వాతంత్ర్య ఫలితాలను సమీక్షించుకుంటే మనం అభివృద్ధి సాదించామనే చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పరిపాలనో ముందుముందు మరింత ప్రగతి సాధిస్తామన్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ జగనన్నా ప్రభుత్వం అభివృద్ధిగా సాగుతోందని […]

నగరి జెండా పండగలో రోజా
Anil kumar poka
|

Updated on: Aug 15, 2019 | 8:46 PM

Share

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని నగరి నియోజకవర్గంలోని పురపాలక సంఘం కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు ఎమ్మెల్యే రోజా. ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు, త్యాగధనుల ప్రతిఫలంగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని గుర్తు చేశారు ఎమ్మెల్యే రోజా. ఒకసారి స్వాతంత్ర్య ఫలితాలను సమీక్షించుకుంటే మనం అభివృద్ధి సాదించామనే చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పరిపాలనో ముందుముందు మరింత ప్రగతి సాధిస్తామన్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ జగనన్నా ప్రభుత్వం అభివృద్ధిగా సాగుతోందని చెప్పారు. సీఎం కార్యదీక్షత, ఐకమత్యంతో కలిసి మెలిసి రాబోవు రోజుల్లో మరిన్ని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటామని తెలిపారు. దేశప్రజలందరికీ 73వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే రోజా.