Andhra Pradesh: పవన్‌వి కిరాయి పాలిటిక్స్.. లోకేష్‌ది ఫేక్‌ పాదయాత్ర.. హీటెక్కిస్తున్న మంత్రుల కామెంట్స్..

|

Mar 08, 2023 | 7:41 AM

ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ వార్‌ ఆసక్తికరంగా మారింది. అధికారపక్షంపై విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే.. అదే స్థాయిలో కౌంటర్‌ ఎటాక్‌కి దిగుతున్నారు మంత్రులు.

Andhra Pradesh: పవన్‌వి కిరాయి పాలిటిక్స్.. లోకేష్‌ది ఫేక్‌ పాదయాత్ర.. హీటెక్కిస్తున్న మంత్రుల కామెంట్స్..
Pawan Lokesh
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ వార్‌ ఆసక్తికరంగా మారింది. అధికారపక్షంపై విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే.. అదే స్థాయిలో కౌంటర్‌ ఎటాక్‌కి దిగుతున్నారు మంత్రులు. పవన్ కిరాయి పాలిటిక్స్ చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపిస్తే.. లోకేష్ పాదయాత్రపై తనదైన స్టయిల్‌లో సెటైర్లు విసిరారు మరో మంత్రి రోజా. ఇలా నేతల హాట్ హాట్‌ కామెంట్లతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో డైలాగ్‌ వార్‌ మరో లెవెల్‌కి వెళ్తోంది. ప్రధానంగా జనసేన అధినేత పవన్‌ను టార్గెట్ చేశారు కొంతమంది మంత్రులు. జనసేనను హైదరాబాద్‌లో వేలం పెట్టారని.. ఏ పార్టీ పాడుకుంటే వారికి జనసేన పనిచేస్తుందన్నారు మంత్రి అంబటి రాంబాబు. పవన్‌ను నమ్ముకుంటే కొంప మునగడం ఖాయమన్నారు.

విశాఖలో జరిగింది గ్లోబల్‌ సమ్మిట్‌ కాదు.. లోకల్‌ ఫేక్‌ సమ్మిట్‌ అన్న లోకేష్ కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మంత్రి రోజా. ఫేక్ పాదయాత్రలు చేసే వాళ్లకి అలాగే కనిపిస్తుందన్నారు. తండ్రీకొడుకులిద్దరూ సమ్మిట్‌కు వస్తే దిగ్గజాలతో సెల్ఫీ దిగే ఛాన్స్‌ వచ్చేదని సెటైర్లు విసిరారు.

టీడీపీ-జనసేనల పొత్తు సంగతేమో గానీ.. ఆ రెండు పార్టీలపై కంబైన్డ్‌గా విరుచుకుపడుతున్నారు మంత్రులు.. తగ్గేదేలే అంటూ విపక్షాలకు కౌంటర్‌ ఇస్తుంటే.. విపక్షాలు సైతం అదే రితిలో విరుచుకుపడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..