AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Koulu Raithulu: సాగు నీరు ఇచ్చి ఆదుకోండి మహాప్రభో.. కోనసీమ జిల్లా కౌలు రైతుల గగ్గోలు..

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వరి చేలకు సాగు నీరు ఇప్పించండి మహాప్రభోఅంటూ కౌలు రైతులు కన్నీరు పెడుతున్నారు. డబ్బులు రైతులకు... ఇబ్బందులు మాకా అంటూ...కౌలు రైతులు గగ్గోలు పెడుతున్నారు.

Koulu Raithulu: సాగు నీరు ఇచ్చి ఆదుకోండి మహాప్రభో.. కోనసీమ జిల్లా కౌలు రైతుల గగ్గోలు..
Koulu Raithu
Sanjay Kasula
|

Updated on: Mar 07, 2023 | 8:33 PM

Share

కోనసీమ జిల్లా లో కౌలు రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు..ప్రాణానికి ప్రాణంగా కాపాడుకున్న వరి పంట కళ్ళముందే ఎండిపోతుంటే దిక్కుతోచక దిగాలుపడుతున్నారు కౌలు రైతులు. ఒకటో రెండో కాదు ఏకంగా వందలాది ఎకరాల్లో ఇదే పరిస్థితి కౌలు రైతుల కంటకన్నీరుపెట్టిస్తోంది. ముమ్మిడివరం మండలం అయినాపురం, సూరాయి చెరువు సోమిదేవరపాలెం, చెయ్యేరు గున్నేపల్లి గ్రామాల్లో రైతులు చేతికొచ్చిన వరి పంట ఎండిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 300 ఎకరాల్లో వరి చేలకు సాగునీరు అందక ఎండిపోతున్న వరి చేలు.

వరి పంట ఈనిక సమయంలో నీరు అందక వరి చేలను కోసి పశువులకు గడ్డి గా ఉప యోగించే దుస్థితి నెలకొందంటూ కన్నీటి పర్యంమవుతున్నారు కౌలు రైతులు.. ఎకరానికి 30,000 పెట్టుబడి పెట్టి నెరలు కొట్టిన వరి చేలను చూసి దిక్కు తోచని స్థితిలో లబోదిబోమంటున్న రైతులు…అధికారుల నిర్లక్షానికి తీవ్రంగా నష్ట పోతున్నామంటున్నారు రైతన్నలు. వరి చేలకు నీరు అందక నష్ట పోయిన రైతాంగాని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న కౌలు రైతులు.

అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సాగునీరు లేక కౌలు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. సాగు నీరు ఇవ్వకపోతే చావే గతి అంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. నీరు లేక ఎండిపోతున్న వరి నారుతో రైతులు నిరసన చేపట్టారు.

ఐ.పోలవరం మండలంలో పంటపొలాలకు సాగు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలకు, పశువులకు కూడా నీరు ఉండటం లేదంటూ గగ్గోలు పెడుతున్నా పట్టించుకున్న నాథుడు లేడంటున్నారు రైతన్నలు. జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా కు స్పందన కార్యక్రమంలో పిర్యాదు చేశారు రైతులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం