పులివెందులలో జగన్‌ను ఓడించే మగాడు పుట్టలే.. బాలకృష్ణకు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి: మంత్రి రోజా

|

Mar 19, 2023 | 4:08 PM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేశ్‌లపై పర్యాటక శాఖ మంత్రి రోజా మళ్లీ విరుచుకుపడ్డారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మాట్లాడిన ఆమె చంద్రబాబు, బాలకృష్ణ, అచ్చెన్నాయుడులకు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్‌ విసిరారు.

పులివెందులలో జగన్‌ను ఓడించే మగాడు పుట్టలే.. బాలకృష్ణకు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి: మంత్రి రోజా
Roja, Balakrishna
Follow us on

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేశ్‌లపై పర్యాటక శాఖ మంత్రి రోజా మళ్లీ విరుచుకుపడ్డారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మాట్లాడిన ఆమె చంద్రబాబు, బాలకృష్ణ, అచ్చెన్నాయుడులకు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్‌ విసిరారు. ‘చంద్రబాబు, లోకేష్ గల్లీ గల్లీ తిరిగినా వెళ్లగొట్టారు. సింబల్ ఎలక్షన్లు వస్తే జగన్ కే ఓటేస్తారు. 2024లో జగన్‌తోనే ప్రజలుంటారు. వైజాగ్ నుంచీ అచ్చెం నాయుడు, చిత్తూరు నుంచీ చంద్రబాబు, అనంతపూరు నుంచి బాలయ్య రిజైన్ చేసి ఎన్నికలకు రావాలి.. గెలుస్తారో లేదో తెలుస్తుంది. యువతకు చంద్రబాబు లోకేష్ ఏం చేశారు? నోరుంది కదా అని వైసీపీ గురించి మాట్లాడద్దు. చంద్రబాబు పార్టీ గాలి పార్టీ. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోం. పులివెందుల లో జగనన్నను ఓడించే మగాడు పుట్టలేదు. వైనాట్ పులివెందుల అన్న ఆయన వచ్చి పులివెందుల లో పోటీ చేయాలి’ అని టీడీపీ నేతలకు సవాల్‌ విసిరారు రోజా.

ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచామంటూ టీడీపీ సంబరాలు చేసుకోవడంపై కూడా సెటైర్లే వేశారు మంత్రి రోజా. ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచామన్న శునకానందం ఇంకొకటి ఉండదు. గెలిచామని సంబరాలు చేసుకోవటం సిగ్గు చేటు. సైకిల్ గుర్తుపై ఓటు వేయలేదు. వైసీసీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి సారి పోటీ చేసింది. వైజాగ్ అభ్యర్థి చిరంజీవి రావు ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా ఇంకా మంచి ఓట్లే వచ్చేవి. టీడీపీ వాళ్లు ఆయన కాళ్లు గడ్డాలు పట్టుకొని తమవైపునకు తిప్పుకున్నారు’ అని విమర్శించారు రోజా.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..