AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పాపం ప్రియుడు.. ప్రియురాలు పిలిచిందని పరుగున వెళ్లాడు.. చివరకు విలవిలాడుతూ..

ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భర్త లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిచిన ఓ వివాహిత.. బ్లేడ్‌తో అతని మర్మాంగంపై దాడి చేసింది.

Andhra Pradesh: పాపం ప్రియుడు.. ప్రియురాలు పిలిచిందని పరుగున వెళ్లాడు.. చివరకు విలవిలాడుతూ..
Ap Crime News
Shaik Madar Saheb
|

Updated on: Dec 20, 2022 | 8:45 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భర్త లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిచిన ఓ వివాహిత.. బ్లేడ్‌తో అతని మర్మాంగంపై దాడి చేసింది. దీంతో ప్రియుడు విలవిలలాడిపోయాడు. ఈ షాకింగ్ ఘటన కోనసీమ జిల్లాలోని తాటిపాకలో జరిగింది. వివాహిత తన ప్రియుడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసిన రెండు రోజుల క్రితం చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాకకు చెందని ఓ వివాహితకు.. గూడపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడి మధ్య కొంత కాలం నుంచి వివాహేతర సంబంధం కొనసాగుతుంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం భర్త బయటకు వెళ్లాడని ప్రియుడికి ఫోన్ చేసింది. ఇంటికి రమ్మని పిలిచింది. దీంతో యువకుడు మహిళ ఇంటికి వెళ్లాడు.

ఈ సమయంలో పలు విషయాలపై మహిళ ప్రియుడిని ఆరా తీసింది. మరో మహిళతో కూడా వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నావంటూ అతనితో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన మహిళ బ్లేడ్‌తో అతని మర్మాంగాన్ని కోసేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రియుడు బయటకు పరుగులు తీశాడు.

ఇవి కూడా చదవండి

గమనించిన స్థానికులు బాధితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..