AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ధర దండిగా పెరిగినా దిగులతో నిమ్మ రైతు.. ఎందుకంటే..?

గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్‌లో క్వింటా నిమ్మకాయల ధర రూ.10,000 దాటి రికార్డు స్థాయికి చేరింది. అయితే, ఎల్ నినో ప్రభావం, వాతావరణ మార్పుల వల్ల దిగుబడి తగ్గడంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. గతంలో ఎకరాకు 40 బస్తాలు రాగా, ప్రస్తుతం 15 బస్తాలు కూడా రావడం లేదని వాపోతున్నారు.

Andhra: ధర దండిగా పెరిగినా దిగులతో నిమ్మ రైతు.. ఎందుకంటే..?
Lemon
Ram Naramaneni
|

Updated on: Sep 08, 2026 | 12:34 PM

Share

నిమ్మకాయల ధరలు ప్రస్తుతం ఆకాశాన్ని అంటుతున్నాయి. గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్‌లో క్వింటా నిమ్మకాయల ధర రికార్డు స్థాయిలో రూ.10,000 మార్కును అధిగమించింది. ఆగస్టు మొదటి వారంలో రూ.6,000 ఉన్న నిమ్మ ధర ఇప్పుడు రూ.10,000 నుంచి రూ.11,000 మధ్య పలుకుతోంది. అయితే, ఈ ధరల పెరుగుదల రైతుల ముఖాల్లో సంతోషాన్ని తీసుకురాలేకపోయింది. ఎల్ నినో ప్రభావం, వాతావరణ మార్పుల కారణంగా ఈ ఏడాది నిమ్మ తోటల్లో దిగుబడి బాగా తగ్గింది. రాష్ట్రంలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఏలూరు, కడప జిల్లాల్లో నిమ్మ తోటలు ఎక్కువగా ఉన్నాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి తెనాలి మార్కెట్‌కు నిమ్మకాయలు ఎక్కువగా వస్తుంటాయి. ఇక్కడి నుంచి పశ్చిమ బెంగాల్, బీహార్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాలకు నిమ్మకాయలు ఎగుమతి అవుతాయి. ప్రస్తుతం అన్నిచోట్లా నిమ్మకాయలకు భారీ డిమాండ్ ఉన్నప్పటికీ, సరైన సరుకు లభించకపోవడం వల్లే ధరలు అమాంతం పెరిగిపోయాయి. గత ఏడాది ఇదే సమయంలో క్వింటా నిమ్మకాయలు కేవలం రూ.800 మాత్రమే పలికాయి. అప్పట్లో కూలీ, రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కాకపోవడంతో రైతులు పంటను పొలాల్లోనే వదిలేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఎన్నడూ లేని విధంగా ధరలు పెరిగినా, రైతుల కష్టాలు మాత్రం తీరడం లేదు. వాతావరణ మార్పులు, తెగుళ్ల ప్రభావం వల్ల నిమ్మ మొక్కలు ఎండిపోవడం, పూత రాలిపోవడం వంటి సమస్యలతో దిగుబడి పడిపోయిందని రైతులు వాపోతున్నారు.

గతంలో ఎకరాకు 40 బస్తాల వరకు నిమ్మ దిగుబడి రాగా, ప్రస్తుతం 15 బస్తాలు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “ధరలు బాగానే ఉన్నాయి, కానీ మా తోటల్లో కాయలే లేవు” అని ఒక రైతు పేర్కొన్నారు. మరో రైతు, “వర్షాలు లేకపోవడమే అసలు కారణం” అని స్పష్టం చేశారు. ప్రస్తుతం మార్కెట్‌కు రోజుకు కేవలం 70 క్వింటాళ్ల సరుకు మాత్రమే వస్తోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఇది 30-40 టన్నుల వరకు ఉండేది. సరుకు తగ్గడం వల్లే డిమాండ్ పెరిగి ధరలు వస్తున్నాయని వారు విశ్లేషిస్తున్నారు. దీపావళి వరకు సరుకు రాక మరింత తగ్గుతుందని అంచనా. ఇప్పుడు పూసే పూత దీపావళి తర్వాత అంటే నవంబర్, చలికాలంలో దిగుబడికి వస్తుంది. అయితే, చలికాలంలో నిమ్మకాయ వాడకం తగ్గిపోవడం వల్ల అప్పుడు ఆశించిన రేటు ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాయలు లేకపోవడం, వర్షాలు లేక ఎండలు ఎక్కువ కావడం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు చెబుతున్నారు.

Follow Us