AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heavy Rains : శ్రీశైలంలో దంచికొట్టిన వర్షం.. వీధులన్నీ జలమయం.. భక్తులకు తీవ్ర ఇక్కట్లు

ప్రముఖ శైవ పుణ్య క్షేత్రం శ్రీశైలంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దాదాపు గంట వరకూ ఎడతెరిపీ లేకుండా కురిసిన భారీ వర్షంతో మండలంలోని పలు రహదారులు జలమయం అయ్యాయి. వర్షం ధాటికి వసతిగృహాలకే పరిమితమయ్యారు భక్తులు. ఈ రోజు ఆరుద్ర నక్షత్రం కావడంతో మల్లన్న స్వామి అమ్మవారితో కలిసి ఉదయం స్వర్ణరథంపై ఊరేగారు.

Heavy Rains : శ్రీశైలంలో దంచికొట్టిన వర్షం.. వీధులన్నీ జలమయం.. భక్తులకు తీవ్ర ఇక్కట్లు
Srisailam Rains
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: May 02, 2025 | 8:57 PM

Share

నంద్యాల జిల్లా శ్రీశైలం మండలంలో అర్ధగంట పాటు వర్షం దంచికొట్టింది కుంభ వర్షం కురిసింది. శ్రీశైలం, సున్నిపెంటలలో ఎడ తెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి క్షేత్రంలో అలానే సుండిపెంటలో ప్రధాన విధులన్ని జలమయమయ్యాయి. ఉదయం నుంచి ఉక్కపోతగా ఉన్నా.. మద్యాహ్నానికి ఒక్కసారిగా మబ్బులతో భారీ వర్షం మొదలైంది. వర్షం కారణంగా శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనార్థం శ్రీశైలం క్షేత్రానికి వచ్చిన భక్తులు వసతి గృహాలకు పరిమితమయ్యారు. ఎండ ఉక్కపోతకు గురైన స్థానికులు భక్తులు భారీ వర్షం పడటంతో కొద్దిపాటి ఉపశమనం పొందారు. ఉరుములు మెరుపులు ఈదురుగాలితో వర్షం మొదలవడంతో ముందస్తుగా విద్యుత్ అధికారులు శ్రీశైలం మండలంలో విద్యుత్తిని నిలిపివేశారు. మరోవైపు ఈ రోజు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఆది దంపతులు స్వర్ణ రధంపై ఊరేగారు.

వైభవంగా స్వర్ణ రథోత్సవం

శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా లోకాకళ్యాణార్ధం శ్రీస్వామి అమ్మవారికి దేవస్థానం ఏసీ చంద్రశేఖర్ రెడ్డి స్వర్ణరథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా వేకువజామునే శ్రీమల్లికార్జునస్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు నిర్వహించారు. అనంతరం స్వర్ణరథోత్సవంలో ఆశీనులైన శ్రీ స్వామి అమ్మవారికి అర్చకస్వాములు ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులిచ్చారు. స్వర్ణరథాన్ని ఆలయ ఎదురుగల గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు మళ్ళీ నంది మండపం నుంచి గంగాధర మండపం వరకు భక్తుల కోలాహలం నడుమ కోలాటాలు ,గిరిజనుల నృత్యాలు మేళతాళాలతో వైభవంగా జరిగింది.

ఇవి కూడా చదవండి

స్వర్ణరథోత్సవంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వందలాదిగా స్థానికులు, భక్తులు తరలివచ్చి స్వర్ణరథోత్సవం తిలకించారు. స్వర్ణరథంలో ఆసీనులైన శ్రీస్వామి అమ్మవారు ఆలయ ప్రధాన వీధిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. అయితే ప్రతీ మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజు ఈ స్వర్ణరథోత్సవాన్ని నిర్వహిస్తామని ఏసీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇదేం సిగ్గులేని పని.. లైవ్‌లో అసభ్యకరమైన సైగలు.. కట్‌చేస్తే..
ఇదేం సిగ్గులేని పని.. లైవ్‌లో అసభ్యకరమైన సైగలు.. కట్‌చేస్తే..
గ్యాస్ సిలిండర్ వాడే వారికి భారీ షాక్.. వీళ్లకు సబ్సిడీ కట్‌..
గ్యాస్ సిలిండర్ వాడే వారికి భారీ షాక్.. వీళ్లకు సబ్సిడీ కట్‌..
అవతార్ లో తన ముఖమే వాడారంటున్న నటి.. కామెరాన్‌పై కోర్టులో దావా
అవతార్ లో తన ముఖమే వాడారంటున్న నటి.. కామెరాన్‌పై కోర్టులో దావా
Google Payలో 'పాకెట్ మనీ' ఆప్షన్‌పై క్లిక్ చేస్తే డబ్బులు పోతాయా?
Google Payలో 'పాకెట్ మనీ' ఆప్షన్‌పై క్లిక్ చేస్తే డబ్బులు పోతాయా?
బాబా వంగా జోస్యం.. మే 16 నుంచి ఈ రాశులకు బంగారం లాంటి భవిష్యత్తే
బాబా వంగా జోస్యం.. మే 16 నుంచి ఈ రాశులకు బంగారం లాంటి భవిష్యత్తే
అపర ఏకాదశి రహస్యం.. సంపద రావాలంటే ఇవి చేయండి.. ఇలా చేస్తే నష్టం త
అపర ఏకాదశి రహస్యం.. సంపద రావాలంటే ఇవి చేయండి.. ఇలా చేస్తే నష్టం త
అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ICAR AIEEA 2026 నోటిఫికేషన్‌
అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ICAR AIEEA 2026 నోటిఫికేషన్‌
మళ్లీ నోరుజారిన సప్తగిరి.. మండిపడుతోన్న ప్రభాస్ ఫ్యాన్స్.. వీడియో
మళ్లీ నోరుజారిన సప్తగిరి.. మండిపడుతోన్న ప్రభాస్ ఫ్యాన్స్.. వీడియో
ఆఫ్ఘాన్‌తో తలపడే భారత జట్టు ఇదే.. ఆ ఓపెనర్‌కు షాకిచ్చిన గంభీర్.?
ఆఫ్ఘాన్‌తో తలపడే భారత జట్టు ఇదే.. ఆ ఓపెనర్‌కు షాకిచ్చిన గంభీర్.?
లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు ప్రకృతి పంపే 5 సంకేతాలు
లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు ప్రకృతి పంపే 5 సంకేతాలు