AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kanipakam Temple: అలాంటిదేమి లేదు.. కాణిపాకం అభిషేకం టికెట్‌ ధర పెంపుపై స్పందించిన మంత్రి

ఏపీలోని కాణిపాకం వినాయక ఆలయంలో పంచామృతాభిషేకం టికెట్ల పెంపుపై ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. టికెట్ల పెంపు విషయంలో ఆయన క్లారిటీ ఇచ్చారు..

Kanipakam Temple: అలాంటిదేమి లేదు.. కాణిపాకం అభిషేకం టికెట్‌ ధర పెంపుపై స్పందించిన మంత్రి
Kanipakam Temple
Subhash Goud
|

Updated on: Oct 06, 2022 | 4:59 PM

Share

కాణిపాకం అభిషేకం టికెట్లపై ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ వివరణ ఇచ్చారు. కాణిపాకం అభిషేకం టికెట్‌ ధరలు పెరగలేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న రూ.700 ధర యథాతథమని, టికెట్‌ ధరల పెంపుపై ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ నిర్వహించనున్నామని అన్నారు. ఆలయ అధికారుల అవాహనా రాహిత్యం ఇలా జరిగిందని, దీనిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. అయితే స్వామివారి పంచామృత అభిషేకం టికెట్‌ ధరలను పెంచుతూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ టికెట్‌ ధర ఏకంగా 7 రేట్లు పెంచుతున్నట్లు, ప్రస్తుతం ఉన్న అభిషేకం టికెట్‌ ధర రూ.700 నుంచి రూ.5000 వరకు పెంచినట్లు వచ్చాయి.

ఇక నుంచి ఈ సేవ భక్తులకు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఈ నేపథ్యంలో టికెట్‌ ధర భారీగా పెంచినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో మంత్రి స్పందించారు. ధరల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. ఇక నుంచి ఈ సేవ భక్తులకు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు కూడా అందుబాటులో ఉంచనున్నారు. అయితే, ఈ పంచామృతాభిషేకం పెంచిన ధరలపై 15 రోజుల్లోగా తమ అభిప్రాయాలను సేకరించనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి