AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jinnah Tower: మళ్లీ తెరపైకి జిన్నా టవర్ వివాదం.. జాతీయ జెండా తొలగింపుపై క్లారిటీ ఇచ్చిన జీఎంసీ

Guntur Jinnah Tower: ఆంధ్రప్రదేశ్‌ గుంటూరులోని జిన్నా టవర్ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. ఇటీవల జిన్నా టవర్ పేరు మార్చాలని.. దీంతోపాటు దానికి త్రివర్ణ రంగులు వేసి

Jinnah Tower: మళ్లీ తెరపైకి జిన్నా టవర్ వివాదం.. జాతీయ జెండా తొలగింపుపై క్లారిటీ ఇచ్చిన జీఎంసీ
Shaik Madar Saheb
|

Updated on: Feb 24, 2022 | 7:02 AM

Share

Guntur Jinnah Tower: ఆంధ్రప్రదేశ్‌ గుంటూరులోని జిన్నా టవర్ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. ఇటీవల జిన్నా టవర్ పేరు మార్చాలని.. దీంతోపాటు దానికి త్రివర్ణ రంగులు వేసి జాతీయ జెండాను ఎగరవేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. లేకపోతే కూల్చివేస్తామంటూ హెచ్చరించడంతో ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టింది. జిన్నా టవర్‌కు త్రివర్ణ రంగులు వేసి, అక్కడ జాతీయ జెండాను ఎగురవేయడంతో ఈ వివాదానికి పుల్‌స్టాప్ పడింది. ఈ క్రమంలో తాజాగా.. అక్కడ ఏర్పాటు చేసిన జాతీయ జెండాను తొలగించారన్న వార్తలు మళ్లీ కలకలం రేపాయి. జాతీయ జెండాను తొలగించారన్న నేపథ్యంలో క్రమంలో కార్పొరేషన్ (guntur municipal corporation )అధికారులు అప్రమత్తమై దీనిపై క్లారిటీ ఇచ్చారు. జిన్నా టవర్ వద్ద జాతీయ జెండాను తొలగించలేదని.. ఎత్తుపెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జీఎంసీ కమిషనర్ నిషాంత్ కుమార్ స్పష్టంచేశారు. గతంలో 40 అడుగుల ఎత్తులో ఉన్న (National Flag) జెండాను 60 అడుగులకు పెంచుతున్నామని.. పాత దిమ్మె స్థానంలో కొత్తగా కాంక్రీట్ వేసి బెస్‌మెంట్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. జిన్నా టవర్‌ వద్ద జాతీయ జెండా విషయంపై అసత్య ప్రచారాలు నమ్మవద్దని కమిషనర్‌ సూచించారు. దిమ్మె పనులు గురువారం మధ్యాహ్నానికి పూర్తవుతాయని.. వెంటనే కొత్త జెండాను ఏర్పాటు చేస్తామని నిశాంత్ కుమార్ తెలిపారు.

బుధవారం పనులను పర్యవేక్షించిన అనంతరం కమిషనర్‌ మాట్లాడుతూ.. జిన్నా టవర్‌ గుంటూరుకే కాకుండా దేశానికే ఐకాన్‌ అని పేర్కొన్నారు. జెండా దిమ్మె బేస్మెంట్‌ పనుల కోసం నగరపాలక సంస్థ ఇంజినీరింగ్‌ అధికారులతో పాత జెండా దిమ్మెను తొలగించి కొత్తది బలంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అయితే.. గత సోమవారం, మంగళవారం రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి నివాళిగా ప్రభుత్వం ప్రకటించిన సంతాప దినాల్లో జిన్నా టవర్‌ వద్ద జాతీయ జెండాను అవనతం చేశామని పేర్కొన్నారు. కొంతమంది చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని, అపొహలకు గురికావొద్దని సూచించారు.

Also Read:

AP CRIME: ఉపాధ్యాయుడి కీచక పర్వం.. విద్యార్థినులకు అశ్లీల చిత్రాలు చూపిస్తూ.. ఎవరికీ చెప్పొద్దంటూ

AP Crime News: అత్యాశ అసలుకే మోసం తెచ్చింది.. రూ. కోట్లు వసూలు చేసి జనాన్ని నట్టేట ముంచిన వెల్ఫేర్ సంస్థ..

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ