AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: అబ్బ.! ఎంత చల్లటి వార్త.. ఏపీలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో.!

ఐఎండి సూచనల ప్రకారం నైరుతి రుతుపవనాలు కర్ణాటక, రాయలసీమ, కోస్తాంధ్ర మరికొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి మరింత విస్తరించాయని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఆ వివరాలు ఇలా..

AP News: అబ్బ.! ఎంత చల్లటి వార్త.. ఏపీలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
Andhra Rain Alert
Ravi Kiran
|

Updated on: Jun 04, 2024 | 8:00 AM

Share

ఐఎండి సూచనల ప్రకారం నైరుతి రుతుపవనాలు కర్ణాటక, రాయలసీమ, కోస్తాంధ్ర మరికొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి మరింత విస్తరించాయని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. దీనితో పాటుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా నైరుతి బంగాళాఖాతంకి ఆనుకుని దక్షిణకోస్తా -ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఆవర్తనం కొనసాగుతుందన్నారు. వీటి ప్రభావంతో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఇది చదవండి: ఇదేం బాహుబలి ఏసీ భయ్యా.! స్విచ్ ఆన్ చేస్తే ఎడారిలోనైనా మంచు కురవాల్సిందే..

బుధవారం విజయనగరం, అల్లూరిసీతారామరాజు, పార్వతీపురంమన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

ఇది చదవండి: పొలం పనుల్లో చేస్తుండగా గడ్డపారకు తగిలిన రాతిడబ్బా.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..