AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: ఉలిక్కి పడ్డ నెల్లూరు.. అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసుల పైనే దాడికి యత్నం.. సీన్‌కట్‌ చేస్తే..

నెల్లూరు జిల్లాలో ఇటీవల శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయా.. అన్నట్లు ఉంది తాజా పరిస్థితి. తప్పు చేసిన వారిని పట్టుకునేందుకు వెళ్ళిన పోలీసులపై దాడికి దిగుతున్న సందర్భాలు ఇటీవల చాలానే జరిగాయి.. తాజాగా ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన హంతకులను పట్టుకునేందుకు వెళ్ళిన పోలీసులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇంతకు నెల్లూరులో ఉం జరుగుతుందో తెలుసుకుందాం పదండి.

Andhra News: ఉలిక్కి పడ్డ నెల్లూరు.. అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసుల పైనే దాడికి యత్నం.. సీన్‌కట్‌ చేస్తే..
Andhra News
Ch Murali
| Edited By: |

Updated on: Nov 29, 2025 | 12:49 PM

Share

నెల్లూరు రూరల పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో కె. పెంచలయ్య(38), దుర్గా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు బిడ్డలు. ఎలక్ట్రిషియన్ పనులు చేసుకుంటూ జీవనం సాగించే పెంచలయ్య.. కొన్నేళ్ల కిందట బోడిగాడితోట నుంచి హౌసింగ్ బోర్డు కాలనీకి మారారు. సమాజ స్పృహతో పాటు వామపక్ష భావజాలం ఉండే ఈయన సీపీఎంలో నాయకుడిగా, ముత్యాలమ్మ గ్రామాభివద్ధి కమిటీ సభ్యుడిగా ఉన్నారు. అయితే కాలనీలో కొందరు యువకులు గంజాయి తాగడం.. విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నట్టు ఆయన గమనించారు. ఈ విక్రయాలు అన్ని ఒక మహిళ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిసి ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు.

దీంతో ఆయనపై కక్ష పెంచుకున్న గంజాయి బ్యాచ్.. అతన్ని ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకుంది. ప్లాన్ ప్రకారం ఆయన శుక్రవారం సాయంత్రం పిల్లలతో కలిసి స్కూటీపై ఇంటికి వెళుతుండగా.. హౌసింగ్ బోర్డు ఆర్చి వద్ద తొమ్మిది మంది గుర్తు తెలియని యువకులు అతన్ను అడ్డుకున్నారు. మాకే అడ్డిస్తావా అంటూ ఒక్కసారిగా వారంతా కత్తులతో ఆయనపై దాడికి పాల్పడ్డారు. బాధితుడు ప్రాణ భీతితో పారిపోతుండగా.. వెంటాడి మరీ కత్తులతో పొడిచి పరారయ్యారు. తీవ్ర గాయాలైన పెంచలయ్యను స్థానికులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్దారించారు.

ఇక సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఉన్నారన్న సమాచారం వారి అరెస్ట్ చేసేందుకు అక్కడికి వెళ్లారు. అయితే ఆ దుండగులు ఏకంగా పోలీసులుపైనే కత్తులతో దాడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిపై కాల్పులు జరపగా.. నిందితుల్లో ఒకడైన జేమ్స్ మోకాలికి గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే మిగతా 9 మంది నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

అయితే నిందితుల దాడిలో ఒక కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. దీంతో గాయపడిన కానిస్టేబుల్, నిందితుల్లో ఒకడైన జేమ్స్‌ను హాస్పిటల్‌కు తరలించారు పోలీసులు. పరారీలో ఉన్న మిగతా తొమ్మిది మంది కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ఈ దాడితో గత కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్న నెల్లూరు ఒక్కసారిగా ఉలిక్కపడింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us