AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kodali Nani: ఎన్టీఆర్‌ వారసులు పార్టీలోకి వస్తుంటే వారికి ఎందుకు గుండెపోట్లు వస్తున్నాయి.. కొడాలి నాని ఫైర్..

టీడీపీ లీడర్ నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర యువగళంపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. పాదయాత్ర చేయడం కంటే ప్రశాంతంగా పడుకోవడమే మంచిదని సెటైర్ వేశారు...

Kodali Nani: ఎన్టీఆర్‌ వారసులు పార్టీలోకి వస్తుంటే వారికి ఎందుకు గుండెపోట్లు వస్తున్నాయి.. కొడాలి నాని ఫైర్..
Kodali Nani
Ganesh Mudavath
|

Updated on: Feb 04, 2023 | 8:29 PM

Share

టీడీపీ లీడర్ నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర యువగళంపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. పాదయాత్ర చేయడం కంటే ప్రశాంతంగా పడుకోవడమే మంచిదని సెటైర్ వేశారు. ముఖ్యమంత్రి జగన్ పై ఇష్టానుసారంగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి.. రోజుకు 10 కిలోమీటర్లు కూడా నడవడం లేదని ఎద్దేవా చేశారు. దివంగత నేత ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి.. సీఎం పదవి లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ వారసులు పార్టీలోకి వస్తుంటే వారికి ఎందుకు గుండెపోట్లు వస్తున్నాయని ప్రశ్నించారు. హరికృష్ణ డిమాండ్‌ చేసినా ఎన్టీఆర్‌ మృతిపై ఎందుకు విచారణ చేయలేదని, ఎన్టీఆర్‌ చనిపోతే ఎందుకు పోస్ట్‌మార్టం చేయించలేదని నిలదీశారు. ఎన్టీఆర్‌ మరణం వెనుక గుట్టు తేల్చాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తానన్నారు కొడాలి నాని.

చంద్రబాబు పాదయాత్ర చేయలేక కొడుకును పంపాడు. జనం లేక లోకేశ్ ఖాళీ కుర్చీలకు స్పీచ్‌లు ఇస్తున్నాడు. నిబంధనలు పాటించమంటే పోలీసులను తిడుతున్నాడు. దత్తపుత్రుడు కూడా హైదరాబాద్‌కు వలస వెళ్లిపోయాడు. సీఎం జగన్‌తో మాట్లాడాలంటే అక్కడి సిబ్బందికే ఫోన్‌ చేయాలి. నవీన్‌కు అవినాష్‌ రెడ్డి ఫోన్‌ చేశారంటూ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. వివేకా హత్య జరిగినప్పుడు సీఎంగా చంద్రబాబే ఉన్నారు. చంద్రబాబు ఫోన్‌ కాల్స్‌పై సీబీఐ విచారణ జరపాలి.

      – కొడాలి నాని, ఏపీ మాజీ మంత్రి

ఇవి కూడా చదవండి

ఈ ఉదయం పూతలపట్టు నియోజకవర్గం వజ్రాలపల్లి విడిది కేంద్రం నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభమైంది. క్యాంప్ సైట్ వద్ద పాదయాత్ర ప్రారంభమయ్యే ముందు సెల్ఫీ విత్ లోకేశ్ కార్యక్రమం కొనసాగింది. కొండ్రాజుకాల్వ వద్ద మధ్యాహ్న భోజన విరామం అనంతరం రాత్రికి తవణంపల్లి విడిది కేంద్రంలో లోకేశ్ బస చేస్తారు. ఇప్పటి వరకు లోకేశ్ పాదయాత్ర 100.8 కిలోమీటర్లు కొనసాగింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో