AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Sharmila: ఏపీలో మొదలైన అసమ్మతి రాగం.. ఆ పదవి వైఎస్ షర్మిలకు ఇవ్వొద్దంటున్న సీనియర్ నేతలు

వైఎస్ షర్మిల.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయగా గుర్తింపు ఉన్న మహిళ. జగన్ సోదరిగా రాజకీయంగా బాగా పాపులర్ అయ్యారు. వైఎస్ఆర్టీపీ అంటూ తెలంగాణలో పార్టీ పెట్టి సుదీర్ఘకాలం పాదయాత్రలు చేశారు. అయితే అనుకున్నంతమేర సక్సెస్ కాలేకపోయారు. తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఈ వారంలోనే ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

YS Sharmila: ఏపీలో మొదలైన అసమ్మతి రాగం.. ఆ పదవి వైఎస్ షర్మిలకు ఇవ్వొద్దంటున్న సీనియర్ నేతలు
Former Mp Harshavardhan
Srikar T
|

Updated on: Jan 12, 2024 | 9:30 AM

Share

వైఎస్ షర్మిల.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయగా గుర్తింపు ఉన్న మహిళ. జగన్ సోదరిగా రాజకీయంగా బాగా పాపులర్ అయ్యారు. వైఎస్ఆర్టీపీ అంటూ తెలంగాణలో పార్టీ పెట్టి సుదీర్ఘకాలం పాదయాత్రలు చేశారు. అయితే అనుకున్నంతమేర సక్సెస్ కాలేకపోయారు. తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఈ వారంలోనే ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈమెను ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేసేలా పదవిని కేటాయిస్తారన్న వార్తలు జోరుగా వినిపిస్తోంది. ఈ తరుణంలో షర్మిల కాంగ్రెస్‌లో ఉంటే ఓకే.. కానీ కీలకమైన ఆ పదవి మాత్రం ఇవ్వొద్దంటూ స్పీడ్ బ్రేక్ వేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ పార్టీ నేత హర్షకుమార్. మరి ఈ మాజీ ఎంపీ విన్నపాన్ని పార్టీ సీరియస్‌గా తీసుకుంటుందా?

వైఎస్‌ఆర్టీపీని విలీనం చేసి కాంగ్రెస్‌లో చేరిన షర్మిలకు ఏపీలో కీలక బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఏపీసీసీ చీఫ్‌గా షర్మిలను నియమిస్తారంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ షర్మిలకు వ్యతిరేకంగా గళం వినిపించారు. షర్మిలకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వొద్దని అధిష్టానానికి సూచించారు. తెలంగాణ బిడ్డ అని చెప్పుకున్న షర్మిలకు ఏపీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తే పార్టీకే డ్యామేజ్ జరుగుతుందనేది ఆయన వాదన. జగన్, షర్మిల ఒక్కటేనని, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తాము సేఫ్ గా ఉండేందుకే చెరో పార్టీ ఎంచుకున్నట్లు హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిలకు పీసీసీ ఛీఫ్ బదులుగా జాతీయ స్ధాయి పదవి ఇవ్వాలన్నారు. ఏఐసీసీ పదవి ఇచ్చి, స్టార్ క్యాంపెనర్ గా ఆమె సేవలు దేశవ్యాప్తంగా వాడుకోవాలని సూచించారు. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజు మాత్రం అధిష్టానం నిర్ణయానికి కట్టుబడతానని ఇప్పటికే ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం