CBN Arrest: రాజమండ్రి జైలులో చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాకాత్
ఉదయం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరతో కలిసి రాజమండ్రి నాళం భీమరాజు వీధిలోని వినాయకుడి ఆలయానికి చేరుకున్న భువనేశ్వరి స్వామివారికి పూజలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యం కోసం భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు. లోకేశ్ అటు పార్లమెంట్ ప్రాంగణంలో చంద్రబాబు అరెస్కు నిరసనగా జరిగిన ధర్నాలో పాల్గొన్నారు.పార్టీ సీనియర్ నేత యనమలతో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. ఇద్దరి మధ్య రాజకీయ - న్యాయ పోరాటంపైన చర్చ జరిగింది. ఫేక్ కేసుతో జాతీయ గుర్తింపు ఉన్న నేతను ఇరికించి జైలులో పెట్టారని ఆరోపించారు యనమల. ఏ తప్పు చేయని నేత తప్పు చేసినట్లు చిత్రీకరించి జైలులో పెట్టారని విమర్శించారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్పై ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన సతీమణి భువనేశ్వరి ములాఖత్ అయ్యారు. ఆమెతో పాటు నారా బ్రాహ్మణి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చంద్రబాబును కలిశారు. చంద్రబాబు ఆరోగ్యం పైన ఆరా తీసారు. రాజకీయంగా అమలు చేయాల్సిన కార్యాచరణ పైన యనమలకు చంద్రబాబు దిశానిర్దేశం చేసారు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి భువనేశ్వరి రాజమండ్రిలోనే ఉంటున్నారు. లోకేశ్ ఢిల్లీలో ఉండటంతో బ్రాహ్మణి అక్కడే భువనేశ్వరితో పాటుగా ఉంటున్నారు. ఇవాళ జైలులో చంద్రబాబుతో ఆ ఇద్దరు యనమలతో కలిసి భేటీ అయ్యారు.అంతకుముందు రాజమండ్రి శ్రీ సిద్ది లక్ష్మీ గణపతి టెంపుల్లో నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
