AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup 2023: ఇండియా కప్ గెలవాలని ప్రత్యేక పూజలు చేసిన అభిమానులు..

ప్రపంచ కప్ తుదిపోరుకు సర్వం సిద్దమైంది. దేశం మొత్తం క్రికెట్‌ ఫివర్‌తో ఊగిపోతోంది. ఎటు చూసినా టీమిండియా గెలవాలన్న నినాదామే వినిపిస్తోంది. టీమిండియాకు ఎదురులేదని అభిమానులు ఢంకా బజాయించి మరీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అహ్మదాబాద్‌లో జరగబోయే వన్డే ప్రపంచకప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా పై టీంఇండియా గెలవాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో క్రీడాభిమానులు ప్రత్యేక పూజలు చేశారు.

J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Nov 19, 2023 | 10:20 AM

Share

ప్రపంచ కప్ తుదిపోరుకు సర్వం సిద్దమైంది. దేశం మొత్తం క్రికెట్‌ ఫివర్‌తో ఊగిపోతోంది. ఎటు చూసినా టీమిండియా గెలవాలన్న నినాదామే వినిపిస్తోంది. టీమిండియాకు ఎదురులేదని అభిమానులు ఢంకా బజాయించి మరీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అహ్మదాబాద్‌లో జరగబోయే వన్డే ప్రపంచకప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా పై టీంఇండియా గెలవాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దత్తసాయి దేవాలయంలో 108 టెంకాయలను కొట్టి క్రికెట్ అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత్ జట్టు గెలవాలని ఇక్కడ యువకులు జాతీయ జెండాలు చేత పట్టి ఇండియా జట్టుకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పూజలు నిర్వహించారు. అభిమానులు దేశవ్యాప్తంగా పూజలు, హోమాలు, యాగాలు చేస్తూ పుష్కర కాలం తర్వాత టీమ్ ఇండియా ఫైనల్లోకి ప్రవేశించడంతో ఈసారి కప్పు రావడం ఖాయమని గంపెడాశలు పెట్టుకున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి