AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizianagaram: అయ్యయ్యో చలి కోసం వాడిన కుంపటి ఎంత పని చేసింది..?

విజయనగరం జిల్లా తెర్లాం మండలం గొలుగువలస గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు పది పూరిళ్లను పూర్తిగా దగ్ధం చేయగా, పాపమ్మ అనే వృద్ధురాలు మంటల్లో చిక్కుకొని సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.

Vizianagaram: అయ్యయ్యో చలి కోసం వాడిన కుంపటి ఎంత పని చేసింది..?
Fire Accident
Gamidi Koteswara Rao
| Edited By: Ram Naramaneni|

Updated on: Dec 13, 2025 | 6:59 PM

Share

విజయనగరం జిల్లా తెర్లాం మండలం గొలుగువలస గ్రామంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. అకస్మాత్తుగా చెలరేగిన అగ్నిప్రమాదం గ్రామాన్ని వణికించింది. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు ఒక్కసారిగా దావనంలా వ్యాపించి తీవ్ర ప్రమాదంగా మారింది. క్షణాల్లోనే మంటలు గ్రామంలోని పది పూరిళ్లను పూర్తిగా దగ్ధం చేశాయి. ఈ ఘటనలో పాపమ్మ అనే వృద్ధురాలు మంటల్లో చిక్కుకొని సజీవ దహనం కావడం హృదయ విదారకంగా మారింది. మంటలు వేగంగా వ్యాపించడంతో బయటకు రావడానికి ఆమెకు అవకాశం లేకుండా పోయిందని గ్రామస్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వృద్ధురాలి మృతి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మంటలు చెలరేగిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినప్పటికీ, పూరిళ్లు కావడంతో అగ్ని వేగంగా వ్యాపించింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది.

ఈ ప్రమాదంలో బాధిత కుటుంబాలు సర్వస్వం కోల్పోయాయి. ఇంట్లో ఉన్న బట్టలు, బియ్యం, నగదు, గృహోపకరణాలు అన్నీ బూడిదయ్యాయి. చలికాలంలో ఇల్లు కోల్పోవడంతో బాధితులు రోడ్డున పడ్డారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. చలి కోసం వాడిన కుంపటి నుంచే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ ఘటనతో గొలుగువలస గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.