Andhra Pradesh: నడిరోడ్డుపై మందుబాబు రచ్చ.. పోలీసులు చెప్పినా విననన్నాడు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Drunken Man: ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఓ మందు బాబు హల్‌చల్ చేశాడు. తాగిన మైకంలో నడిరోడ్డుపై నానా యాగీ చేశాడు. మద్యం బాటిల్‌తో తలకేసి కొట్టుకున్నాడు.

Andhra Pradesh: నడిరోడ్డుపై మందుబాబు రచ్చ.. పోలీసులు చెప్పినా విననన్నాడు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Drunken Man
Follow us

|

Updated on: Nov 13, 2021 | 9:07 AM

Drunken Man: ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఓ మందు బాబు హల్‌చల్ చేశాడు. తాగిన మైకంలో నడిరోడ్డుపై నానా యాగీ చేశాడు. మద్యం బాటిల్‌తో తలకేసి కొట్టుకున్నాడు. ఆపై తననెవరో కొట్టారంటూ హంగామా చేశాడు. తీవ్ర రక్తస్త్రావం అవుతున్నప్పటికీ.. రోడ్డుపై పొర్లాడుతూ రచ్చ రచ్చ చేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు మద్యం తాగిన వ్యక్తిని సమీపించారు. పోలీసులు వారించినా వినలేదు ఆ మందుబాబు. నడిరోడ్డుపై పడుకుని తనను కొంతమంది కొట్టారంటూ నానా యాగీ చేశారు. ఎంత చెప్పినా వినకపోవడంతో చివరకు పోలీసులు అతన్ని బలవంతంగా అంబులెన్స్ ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఒంగోలు నగరంలోని నెల్లూరు బస్టాండ్ సెంటర్‌లో చోటు చేసుకుంది. కాగా, ఓ బార్‌లో మద్యం తాగి గొడవపడుతున్నాడని బార్‌ సిబ్బంది యువకుడిని బయటకు పంపడంతో.. రోడ్డుపైకి వచ్చిన యువకుడు నానా బీభత్సం సృష్టించిచాడు. నడిరోడ్డుపై జరిగిన ఈ సంఘటనతో కొద్దిసేపు ఏం జరుగుతుందో తెలియక స్థానికులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు వచ్చి అతన్ని తీసుకెళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Also read:

Asian Games 2022: ఆర్చరీ ఈవెంట్లను పెంచిన ఇంటర్నేషనల్ ఫెడరేషన్.. 2022 ఆసియా గేమ్స్‌లో ఎన్ని ఈవెంట్లలో పోటీలంటే?

Sai Dharam Tej: యాక్సిడెంట్‌ తర్వాత తొలిసారి కెమెరా ముందుకు సాయితేజ్‌.. (వీడియో)

World Chess Championship 2021: సరికొత్త పాత్రలో విశ్వనాథన్ ఆనంద్.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌2021లో ఏం చేయనున్నాడంటే?