AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: పండుగ పూట ఘోర విషాదం.. ఎంజాయ్ చేసేందుకు వెళ్లిన 9 మంది యువకులు.. ఆ తర్వాత జరిగిందిదే..

పండుగ పూట ఏపీలోని విశాఖపట్నంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.. దీపావళి పండుగను పురస్కరించుకుని 9 మంది యువకులు.. ఎంజాయ్ చేసేందుకు విశాఖ యారాడ బీచ్ దగ్గరకు వెళ్లారు.. నీళ్ల లోపలికి వద్దు.. అంటూ అక్కడున్న పోలీసులు చెప్పారు.. వినలేదు.. చాలా సార్లు చెప్పారు.. అయినా వారు వినకుండా తప్పించుకుంటూ.. నీటిలోకి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ కేరింతలు కొట్టారు.

Andhra: పండుగ పూట ఘోర విషాదం.. ఎంజాయ్ చేసేందుకు వెళ్లిన 9 మంది యువకులు.. ఆ తర్వాత జరిగిందిదే..
Vizag Yarada Beach
Shaik Madar Saheb
|

Updated on: Oct 20, 2025 | 11:14 AM

Share

పండుగ పూట ఏపీలోని విశాఖపట్నంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.. దీపావళి పండుగను పురస్కరించుకుని 9 మంది యువకులు.. ఎంజాయ్ చేసేందుకు విశాఖ యారాడ బీచ్ దగ్గరకు వెళ్లారు.. నీళ్ల లోపలికి వద్దు.. అంటూ అక్కడున్న పోలీసులు చెప్పారు.. వినలేదు.. చాలా సార్లు చెప్పారు.. అయినా వారు వినకుండా తప్పించుకుంటూ.. నీటిలోకి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ కేరింతలు కొట్టారు. ఇంతలోనే.. అలలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి.. 9 మందిలో ఇద్దరు కెరటాల్లో కొట్టుకుపోయారు.. ఈ విషాద ఘటన విశాఖ యారాడ బీచ్‌లో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.. గల్లంతైన ఇద్దరు యువకుల కోసం అప్పటినుంచి గాలింపు కొనసాగుతోంది.. ఇప్పటివరకు వారి జాడ లభించలేదని పోలీసులు చెప్పారు.

యారడ బీచ్ దగ్గరకు వెళ్లారు 9 మంది యువకులు వచ్చారని.. ఈ క్రమంలో సముద్రంలో స్నానం చేస్తుండగా గణేష్, పవన్ కెరటాల్లో కొట్టుకుపోయారని వారి స్నేహితులు, పోలీసులు తెలిపారు. గల్లంతైన ఇద్దరు యువకుల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.. పండుగ రోజు తమ బిడ్డలు గల్లంతవ్వడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సరదాగా ఎంజాయ్ చేద్దామని బీచ్ దగ్గరకు వెళ్లిన యువకులంతా షాక్‌లో ఉన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..