AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పురుగుల మందు తాగి చనిపోయిన వ్యక్తి.. 40 రోజుల తర్వాత తిరిగి వచ్చాడు.. ట్విస్ట్ ఏంటంటే..?

ప్రకాశం జిల్లాలో ఓ వింత ఘటన వెలుగుచూసింది. చనిపోయిన ఓ వ్యక్తి 40 రోజుల తర్వాత తిరిగి ఇంటికి వచ్చాడు. దీంతో అందరూ కంగుతిన్నారు. అసలు విషయం ఏంటంటే...?

Andhra Pradesh: పురుగుల మందు తాగి చనిపోయిన వ్యక్తి.. 40 రోజుల తర్వాత తిరిగి వచ్చాడు.. ట్విస్ట్ ఏంటంటే..?
Dead Man Returns
Ram Naramaneni
|

Updated on: Jul 28, 2022 | 5:52 PM

Share

Bizarre: ఒక్కోసారి మన కళ్లు మనల్ని మోసం చేస్తాయన్నది మరోసారి రుజువైంది. ప్రకాశం జిల్లా(Prakasam District) గిద్దలూరు మండలం(Giddalur Mandal)లో వెలుగుచూసిన ఓ వింత ఘటన గురించి తెలిస్తే మీరు కూడా ఔరా అంటారు. ముండ్లపాడుకు చెందిన సయ్యద్‌ మియా అనే మతిస్థిమితం లేని వ్యక్తి 40 రోజుల క్రితం పురుగుమందుతాగి మృతి చెందాడు. అందరిలాగే కుటుంబసభ్యులు మృతదేహానికి అంత్యక్రియలు కూడా పూర్తిచేశారు. ఖర్మకాండలు జరిపి… బంధువులను పిలిచి భోజనం పెట్టారు. ఇందులో అంత వింతేముందంటారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్‌. సరిగ్గా భోజనాల టైంకి సయ్యద్‌మియా ప్రత్యక్షం కావడంతో కుటుంబసభ్యులు షాక్‌ గురయ్యారు. కాసేపు తమను తాము నమ్మలేకబోయారు. ఎగాదిగా చూసిన తర్వాత అతను సయ్యద్‌ మియా నిజమేనని నిర్ధారించుకున్నారు. ఇంకేముంది చనిపోయాడనుకున్న సయ్యద్‌మియా ఇల్లు చేరేసరికి ఆ కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అసలు జరిగిందేమిటంటే.. పురుగులమందు తాగి చనిపోయిన వ్యక్తికి, సయ్యద్‌మియాకు దగ్గరి పోలికలు ఉన్నాయి. దీంతో కుటుంబసభ్యులు కూడా సయ్యద్‌ మియానే చనిపోయినట్లు భావించారు. అందరిలాగే రోదించారు. అంత్యక్రియలు చేశారు. ఒక్కసారిగా తిరిగొచ్చిన సయ్యద్‌మియాను చూసి తొలుత షాకయ్యారు. ఆ తర్వాత తేరుకున్నారు. ఆనందంలో మునిగిపోయారు. చనిపోయాడునుకున్న సయ్యద్‌ సడెన్‌ కనిపించడంతో ఆనందంగా ఉందంటున్నారు కుటుంబసభ్యులు. దీంతో ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేశారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి