Nara Lokesh: రెడ్ బుక్ అంశంపై స్పందించిన న్యాయస్థానం.. నారా లోకేష్కు నోటీసులు..
రెడ్ బుక్ అంశంపై సీఐడీ అధికారులు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు నోటీసులు ఇచ్చారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టిన రోజు నుంచి అధికారులు తమను ఇబ్బంది పెడుతున్నారని అరోపించారు. అడుగడుగునా తనకు అడ్డు తగులుతున్నారని నిరసనలు కూడా చేశారు. ఈ క్రమంలోనే రెడ్ బుక్ అంశం తెరపైకి వచ్చింది.

రెడ్ బుక్ అంశంపై సీఐడీ అధికారులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు నోటీసులు ఇచ్చారు. రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ తమను బెదిరిస్తున్నారని కొందరు అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు సూచనల మేరకు సీఐడీ అధికారులు లోకేష్కు శుక్రవారం వాట్సప్లో నోటీసులు పంపించారు. నోటీసులు అందుకున్నట్లు సీఐడీ అధికారులకు లోకేష్ సమాధానం కూడా ఇచ్చారు. అయితే ఈ కేసు విచారణ జనవరి 9కి వాయిదా వేసింది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.
ఇదిలా ఉంటే యువగళం పాదయాత్రకు అడుగడుగునా అడ్డు తగులుతున్నారని నారా లోకేష్ గతంలో నిరసనలు చేశారు. తనను అడ్డుకున్న అధికారులు, నాయకుల పేర్లను రెడ్ బుక్లో రాసుకున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ వాళ్లను ఇబ్బంది పెట్టి, అసౌకర్యానికి గురి చేసిన ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటానని హెచ్చరించారు. అలాగే వైసీపీ ప్రభుత్వం తమపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు నారా లోకేష్. దీనిపై స్పందించిన కొందరు అధికారులు నారా లోకేష్పై కంప్లైంట్ చేశారు. రెడ్ బుక్ పేరుతో తమను బెదిరిస్తున్నారని ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు అదేశాల మేరకు సీఐడీ అధికారులు ఈరోజు నారా లోకేష్ కు నోటీసులు పంపించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..