Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP: ఏప్రిల్ 9న అమరావతిలో సీఎం ఇంటికి భూమిపూజ! రాజధానికే ప్రత్యేక ఆకర్షణలా..

అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 5 ఎకరాల స్థలంలో కొత్త ఇంటి నిర్మాణం ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 9న శంకుస్థాపన జరుగుతుంది. ఇంటి నిర్మాణంలో ఉద్యానవనం, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ నిర్మాణం అమరావతి అభివృద్ధికి సంకేతంగా భావిస్తున్నారు.

AP: ఏప్రిల్ 9న అమరావతిలో సీఎం ఇంటికి భూమిపూజ! రాజధానికే ప్రత్యేక ఆకర్షణలా..
Cm Chandrababu
Follow us
SN Pasha

|

Updated on: Mar 29, 2025 | 12:45 PM

అమరావతి రాజధానిలో ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్తగా కొనుగోలు చేసిన స్థలంలో ఏప్రిల్ 9న శంకుస్థాపన చేయనున్నారు. కొత్తగా కొనుగోలు చేసిన స్థలంలో ఇంటి నిర్మాణానికి ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. వెలగపూడి రెవెన్యూ పరిధిలోని E6 రోడ్డుకు ఆనుకుని 5 ఎకరాల స్థలం కొనుగోలు చేసారు సీఎం చంద్రబాబు. అమరావతి పునర్నిర్మాణ పనులు త్వరలో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ లోపే రిజిస్ట్రేషన్ ప్రక్రియ, భూమి పూజ చేసి వెంటనే నిర్మాణాలను ప్రారంభించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇంటి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ ప్రదేశం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌కు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. భవిష్యత్తులో రాజధానిగా మరింత ప్రాధాన్యత పొందనున్న ఈ ప్రాంతంలో ఒక ప్రతిష్టాత్మకమైన ఇంటిని నిర్మించాలని ఆయన సంకల్పించారు.

ప్లానింగ్ ఇలా..

ఇంటి నిర్మాణంలో బహుళ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఉద్యానవనం, రక్షణ సిబ్బందికి ప్రత్యేక గదులు, వాహనాల పార్కింగ్ వంటి అంశాలను ముందుగా పరిగణనలోకి తీసుకున్నారు. వీటిని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యమంత్రి ఇంటి పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని నిశ్చయించుకున్నారు. ఈ పనుల వేగవంతంలో భాగంగా ఇటీవల మంత్రి లోకేశ్ కార్యాలయ సిబ్బంది, వాస్తు సిద్ధాంతులు కలిసి స్థలాన్ని పరిశీలించారు. భూమి చదును చేసే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ..

ఈ నెలాఖరుకు ఈ స్థలాన్ని పూర్తిగా రిజిస్ట్రేషన్ చేయించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, స్థలం వెళ్తున్న విద్యుత్తు స్తంభాలను కూడా మార్చే ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులు త్వరలోనే ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కొత్త ఇంటి నిర్మాణం మరింత ఆసక్తికరంగా మారింది. ఇక ఈ నిర్మాణం ప్రారంభమైన వెంటనే, పనులు మరింత వేగంగా ముందుకు సాగనున్నాయి. ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా నిర్మాణ పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రాముఖ్యంతో చూస్తోంది. భవిష్యత్తులో ఇది ఒక ప్రతిష్టాత్మక స్థలంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమరావతి నగర అభివృద్ధికి ఈ ఇంటి నిర్మాణం ఒక సంకేతంగా మారనుంది. అభివృద్ధి పనులకు ఇది ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. ఈ నిర్మాణంతోపాటు సమీప ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజ్ సదుపాయాలు మెరుగుపరిచే పనులు కూడా ప్రారంభం కానున్నాయి. దీంతో అమరావతి మరింత ఆకర్షణీయమైన నగరంగా అభివృద్ధి చెందనుంది.