AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YCP Kapu Leaders Meet: పవన్‌ సింగిల్‌గా పోటీ చేయగలరా..? ప్రశ్నలు సంధించిన వైసీపీ కాపు నేతల సమావేశం

2019కి ముందు, ఆ తర్వాత కాపుల పరిస్థితిని, వారికి అందిన పథకాలను జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది వైసీపీ. అందుకోసం కాపు నేతలందరితో విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవాడలో నిర్వహించబోతోంది.

YCP Kapu Leaders Meet: పవన్‌ సింగిల్‌గా పోటీ చేయగలరా..? ప్రశ్నలు సంధించిన వైసీపీ కాపు నేతల సమావేశం
Ysrcp Kapu Ministers Meet
Shaik Madar Saheb
|

Updated on: Oct 31, 2022 | 6:48 PM

Share

ఆంధ్రప్రదేశ్లో 2019కి ముందు, ఆ తర్వాత కాపుల పరిస్థితిని, వారికి అందిన పథకాలను జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది వైసీపీ. అందుకోసం కాపు నేతలందరితో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏపీలోని విజయవాడలో నిర్వహించబోతోంది. రాజమండ్రిలో భేటీ అయిన కాపు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సుదీర్ఘంగా చర్చించారు. పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. కాపులకు ఎక్కువ మేలు చేసింది.. వైఎస్ఆర్ సీపీనే అంటూ పేర్కొన్నారు.

ఏపీలో కాపుల చుట్టూ మళ్లీ రాజకీయం మొదలైన నేపథ్యంలో రాజమండ్రిలో వైసీపీకి చెందిన ఆ సామాజికవర్గ కీలక ప్రజాప్రతినిధుల భేటీ ఆసక్తిగా మారింది. వైసీపీలోని కాపు నేతలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను ఈ సమావేశం తీవ్రంగా ఖండించింది. టీడీపీ హయాంలో, ఇప్పుడు కాపుల పరిస్థితి, వారికి అందిన, అందుతున్న పథకాలపై చర్చించారు నేతలు. 2014 నుంచి 2019 వరకు రెండు లక్షల 54 వేల మంది కాపులకు 1824 కోట్ల సాయం అందితే, ఈ మూడున్నరేళ్లలో 70 లక్షల 83 వేల మందికి 26 వేల 490 కోట్ల లబ్ది చేకూరిందని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ వివరించారు.

మరోవైపు ఇటీవల వైసీపీలోని కాపు నేతలపై, రంగా హత్యపై పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు, చంద్రబాబును కలవడంపైనా సమావేశంలో చర్చించారు. చంద్రబాబు కోసమే జనసేన అధ్యక్షుడు పని చేస్తున్నారని విమర్శించారు మంత్రులు. జనసేన సెలబ్రిటీ పార్టీ అని, చంద్రబాబు కోసం పని చేయకపోతే పవన్‌ కల్యాణ్‌ 175 సీట్లలో సింగిల్‌గా పోటీ చేయగలరా అంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

పవన్‌ కల్యాణ్‌ ప్యాకేజ్‌ కోసమే పని చేస్తున్నారని తాము ముందు నుంచి చెబుతున్నదే నిజమైందంటూ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.

కాగా.. ఈ విమర్శలకు కౌంటర్‌ ఇచ్చింది జనసేన. వైసీపీ నుంచి కాపుల్లో ఎవరినైనా సీఎం అభ్యర్థిగా ప్రకటించే దమ్ము ఉందా అని ఆ పార్టీని ప్రశ్నించారు జనసేన నేత కందుల దుర్గేష్‌.

మరోవైపు కాపుల అంశంపై చర్చించేందుకు త్వరలోనే విజయవాడలో భేటీ కావాలని వైసీపీ నేతలు నిర్ణయించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...