AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam: శ్రీశైలంలో బాంబులు, బుల్లెట్ల కలకలం – విషయం తేల్చేసిన పోలీసులు

శ్రీశైలం వాసవీ సత్రం ఎదురుగా ఉన్న డివైడర్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన సంచి స్థానికులను ఆందోళనకు గురిచేసింది. సత్రం ఎదుట వెళ్తున్న కొందరు స్థానికులు డివైడర్‌పై ఉన్న సంచిని గమనించి, అనుమానంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న శ్రీశైలం పోలీసులు, బాంబు స్క్వాడ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సంచిని పరిశీలించారు. తనిఖీ తర్వాత, అందులో బుల్లెట్లు ఉన్నట్లు నిర్ధారించారు. అయితే వీటిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు.

Srisailam: శ్రీశైలంలో బాంబులు, బుల్లెట్ల కలకలం - విషయం తేల్చేసిన పోలీసులు
Bullets
Ram Naramaneni
|

Updated on: Jun 24, 2025 | 8:13 AM

Share

శ్రీశైలంలో బుల్లెట్స్ కలకలం రేపాయి. శ్రీశైలం వాసవి సత్రం ఎదురు రోడ్డు డివైడర్ పైన 9 పెద్ద సైజు బుల్లెట్స్, నాలుగు చిన్న సైజు బుల్లెట్స్ లభ్యమయ్యాయి. రోడ్డు డివైడర్ మధ్యలో బుల్లెట్స్ సంచిని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. అక్కడే ఉన్న కూలీ పని చేసే వారు సంచిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే బందోబస్తు విధులు నిర్వర్తించే ఏ.ఆర్, బాంబ్ స్క్వాడ్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సంచిలోని బుల్లెట్లను తనిఖీ చేశారు. అందులో 303కి చెందిన 6 బుల్లెట్లు, SLRకు చెందిన ఐదు బుల్లెట్లు, SLRకు చెందిన నాలుగు ఖాళీ బుల్లెట్లు, 9MMకు చెందిన 4 బుల్లెట్లు గుర్తించారు. అయితే ఈ బుల్లెట్స్‌ శ్రీశైలం ఏఆర్‌ కానిస్టేబుల్స్‌కి సంబంధించినవి ఆత్మకూరు DSP రామాంజినాయక్‌ తెలిపారు. వాసవీ సత్రం దగ్గర భోజనానికి వెళ్లి బుల్లెట్లను మరచిపోయాడని తెలిపారు.

సదరు కానిస్టేబుల్ మరో వారం రోజుల్లో రిటైర్ అవ్వాల్సి ఉందని…  ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు DSP. ఆయన భక్తి మార్గాన్ని అనుసరిస్తారని.. అందుకే ఎర్ర గుడ్డ క్యారీ చేస్తారని వివరించారు.  అయితే అదే సంచిలో కొన్ని వంకాయ బాంబ్స్ కూడా ఉన్నాయి. అవి ఎందుకు ఆ కానిస్టేబుల్ వద్ద ఉన్నాయి అనే అంశంపై మాత్రం స్పష్టత రాలేదు.

మరిన్ని అంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..