AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. చడిచప్పుడు లేకండా చిటికెలో మాయం చేశారు.. !

పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం పలుదేవర్లపాడుకు చెందిన యనమల ఎడ్వర్డ్ మేకలు, గొర్రెలు పెంచుకుని జీవనం సాగిస్తున్నాడు. తన గ్రామంలోని ఇంటికి సమీపంలోనే ఒక దొడ్డి ఏర్పాటు చేసుకుని రాత్రి సమయంలో వాటిని అక్కడ ఉంచుతాడు. అయితే శనివారం(ఫిబ్రవరి 1) తెల్లవారుజామున లేచిన ఎడ్వర్డ్, తన దొడ్డి వద్దకు వెళ్లిచూడగా కొన్ని గొర్రెలు కనిపించకుందాపోయాయి.

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. చడిచప్పుడు లేకండా చిటికెలో మాయం చేశారు.. !
Goats Stolen
T Nagaraju
| Edited By: |

Updated on: Mar 02, 2025 | 2:49 PM

Share

బర్డ్ ప్లూ భయంతో చికెన్ అమ్మకాలు మందగించాయి. బర్డ్ ప్లూ భయం లేదని చాటడానికి అనేక చోట్ల చికెన్ మేళాలు పెడుతున్నారు. అయినప్పటికీ చికెన్ అమ్మకాలు ఇంకా సాధారణ స్థాయికి రావడం లేదు. మరోవైపు చికెన్ అమ్మకాలు మందగించడంతో మటన్ కు డిమాండ్ పెరిగింది. గతం కంటే అధికంగా మటన్ అమ్మకాలు కొనసాగుతన్నాయి. అయితే మాములుగా కొనుక్కొని వండుకొని తింటే ఏముంటుందనుకున్నారో ఏమో ఆ దొంగలు… ఏకంగా వాటినే దొంగలించారు. అది కూడా సరికొత్త పద్దతిని ఎంచుకుని మరి ఎత్తుకుపోయారు.

పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం పలుదేవర్లపాడుకు చెందిన యనమల ఎడ్వర్డ్ మేకలు, గొర్రెలు పెంచుకుని జీవనం సాగిస్తున్నాడు. తన గ్రామంలోని ఇంటికి సమీపంలోనే ఒక దొడ్డి ఏర్పాటు చేసుకుని రాత్రి సమయంలో వాటిని అక్కడ ఉంచుతాడు. అయితే శనివారం(ఫిబ్రవరి 1) తెల్లవారుజామున లేచిన ఎడ్వర్డ్, తన దొడ్డి వద్దకు వెళ్లిచూడగా కొన్ని గొర్రెలు కనిపించకుందాపోయాయి. దీంతో అవాక్కైన గొర్రెల యజమాని వెంటనే ఏమై ఉంటుందోనని ఆలోచించడం మొదలు పెట్టాడు. దొడ్డి చుట్టూ ఉన్న కంచెను తొలగించడంతో ఇది దొంగల పనే అని అర్ధం అయింది.

అయితే గొర్రెలు అరవకుండా ఎలా దొంగలించి ఉంటారో అర్ధం కాలేదు. దీంతో వెంటనే గ్రామంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. దీంతో మసీదు వద్ద ఉన్న సీసీ కెమెరాలో కారు నిలిపి అందులో గొర్రెలను సరిచేస్తున్న విజువల్స్ కనిపించాయి. దీంతో దొంగలు తమ గొర్రెలను అపహరించి అవి అరవకుండా తెలివిగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు అర్ధమైంది. దీంతో ఎడ్వర్డ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాదాపు లక్షన్నర విలువ చేసే గొర్రెలు, మేకలు తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. వెంటనే పోలీసులు వివిద సీసీ కెమెరా విజువల్స్ సాయంతో దొంగలను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. మటన్ ధరలు పెరగడంతో దొంగలు వాటిని అపహరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. అదివారం మార్కెట్ లో ఎవరికి అనుమానం రాకుండా అమ్మి ఉంటారన్న అనుమానిస్తున్నారు. మరి పోలీసులు అసలు దొంగలన్ని పట్టుకుంటారో లేదో వేచి చూడాల్సి ఉంది..!

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?