AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో రేషన్ బియ్యం డోర్ డెలివరీకి ఏర్పాట్లు వేగవంతం.. మినీ ట్రక్కుల లభ్దిదారుల ఎంపిక పూర్తి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ బియ్యం, నిత్యావసర సరుకుల్ని నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్ధకే ఇవ్వడానికి ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఇందుకోసం ఈ నెల 4న అధికారులు జిల్లాల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించి

ఏపీలో రేషన్ బియ్యం డోర్ డెలివరీకి ఏర్పాట్లు వేగవంతం.. మినీ ట్రక్కుల లభ్దిదారుల ఎంపిక పూర్తి..
Rajitha Chanti
|

Updated on: Dec 13, 2020 | 7:11 AM

Share

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ బియ్యం, నిత్యావసర సరుకుల్ని నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్ధకే ఇవ్వడానికి ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఇందుకోసం ఈ నెల 4న అధికారులు జిల్లాల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించి మినీ ట్రక్కులు పొందేందుకు లబ్ధిదారుల జాబితాలను తయారు చేశారు. కాగా ఎంపికైన లబ్ధిదారుల జాబితాలపై జిల్లాల కలెక్టర్లు ఆమోద ముద్ర వేసి ఆయా జిల్లాల ఇన్‏చార్జ్ మంత్రులకు పంపించారు. ఇన్‏చార్జ్ మంత్రి ఆమోదం రాగానే జాబితాను రాష్ట్రస్థాయి అధికారులను పంపించనున్నారు.

అటు రాష్ట్రస్థాయి అధికారుల నుంచి ఆమోదం పొందిన జాబితాను ముఖ్య కార్యదర్శికి పంపిస్తారు. వారి నుంచి అనుమతి రాగానే తిరిగి జిల్లాకు ఈ జాబితాలను పంపనున్నారు. ప్రభుత్వం నియమాల ప్రకారం బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మినీ ట్రక్కులను కేటాయించారు. ఆయా కార్పొరేషన్ల ఈడీలు సంబంధిత బ్యాంకులతో మాట్లాడి ఎంపికైన లబ్ధిదారులకు మినీ ట్రక్కులను కొనడానికి లోన్స్ ఇప్పిస్తారు. ఈ ట్రక్కులను సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఇంటింటికీ బియ్యం, నిత్యావసర సరుకుల్ని రవాణాకు మాత్రమే ఉపయోగిస్తారు. లబ్ధిదారుల తరుపున లోన్ రుణాలను 72 వాయిదాల్లో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నేరుగా బ్యాంకులకు చెల్లిస్తుంది. బ్యాంక్ లోన్‏తోపాటు అన్ని ఖర్చులు పోనూ రూ.10 వేల చొప్పున లబ్ధిదారులకు చెల్లించనుంది. కాగా 72 నెలల అనంతరం మినీ ట్రక్కు లబ్ధిదారుని సొంతమవుతుంది.