AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goutham Reddy: నెల్లూరు చేరుకున్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయం.. శోకసంద్రంలో అభిమానులు

గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయం సొంత జిల్లా నెల్లూరు చేరుకుంది. హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌ పోర్ట్ నుంచి ప్రత్యేక నేవీ హెలీకాఫ్టర్‌లో గౌతమ్‌ రెడ్డి డెడ్‌బాడీని నెల్లూరుకు తీసుకువచ్చారు.

Goutham Reddy: నెల్లూరు చేరుకున్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయం.. శోకసంద్రంలో అభిమానులు
Goutham
Balaraju Goud
|

Updated on: Feb 22, 2022 | 12:20 PM

Share

Mekapati Goutham Reddy: నిన్న గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయం సొంత జిల్లా నెల్లూరు చేరుకుంది. హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌ పోర్ట్ నుంచి ప్రత్యేక నేవీ హెలీకాఫ్టర్‌లో గౌతమ్‌ రెడ్డి డెడ్‌బాడీని నెల్లూరుకు తీసుకువచ్చారు. నెల్లూరు పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు తరలించారు. పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి గౌతమ్‌రెడ్డి నివాసానికి ఆయన భౌతికకాయాన్ని మంత్రి అనిల్ కుమర్ తదితరులు దగ్గరుండి తరలించనున్నారు. ఇప్పటికే గౌతమ్‌ రెడ్డి ఇంటి దగ్గర విషాదఛాయలు అలుకుకున్నాయి. గౌతమ్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు, బంధువులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. అభిమాన నాయకుడికి కడసారి వీడ్కోలు పలికేందుకు భారీగా తరలివస్తున్నారు మేకపాటి అభిమానులు.

అభిమానుల సందర్శనార్థం ఏర్పాట్లు చేశారు. రాత్రికి గౌతమ్‌రెడ్డి కుమారుడు నెల్లూరు చేరుకుంటారు. రేపు ఉదయగిరిలో అధికార లాంఛనాలతో నిర్వహించే అంత్యక్రియలకు సీఎం జగన్‌, మంత్రులు, ప్రముఖులు హాజరవుతారు. అధికార లాంఛనాలతో నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించగా.. ఉదయగిరి మెరిట్ ఇంజనీరింగ్ కాలేజీలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గౌతమ్‌రెడ్డి లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఏపీ ఇరిగేషన్‌ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. చాల విషయాల్లోనూ నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించేవారన్నారు. పెద్దన్నను కోల్పోయినట్లు ఉందన్నారు. అధికారదర్పం ఉండేది కాదని.. అందరితోనూ స్నేహంగా ఉండేవారన్నారు. కాగా, అమెరికాలో ఉంటున్న గౌతం రెడ్డి కుమారుడు కృష్ణార్జున‌రెడ్డి రావాల్సి ఉంది. ఇప్పటికే అత‌ను బ‌య‌లుదేరారు. సాయంత్రానికి చేరుకుంటారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆయన రాగానే అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు. మరోవైపు, గౌతంరెడ్డి మృతితో రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ కార్యక్రమాల‌ను కూడా వాయిదా వేశారు.

Read Also…  Goutham Reddy: ప్రత్యేక నేవీ హెలికాప్టర్‌లో నెల్లూరుకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయం తరలింపు