AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Alert: బాబోయ్ ఎండలు.. భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ ఒక్క ప్రాంతంలోనే వర్షాలు..

ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. ఉష్ణోగ్రతలు భారీగా పెరగుతుండటం.. తీవ్ర ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఈ క్రమంలోనే.. వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండతీవ్రత పెరుగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ పేర్కోన్నారు. సోమవారం పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకానిలో 43.7°C గరిష్ఠ ఉష్ణోగ్రత, 17 జిల్లాల్లో 41°Cకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు వెల్లడించారు.

Weather Alert: బాబోయ్ ఎండలు.. భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ ఒక్క ప్రాంతంలోనే వర్షాలు..
Weather Report
Shaik Madar Saheb
|

Updated on: May 12, 2025 | 6:00 PM

Share

ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. ఉష్ణోగ్రతలు భారీగా పెరగుతుండటం.. తీవ్ర ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఈ క్రమంలోనే.. వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండతీవ్రత పెరుగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ పేర్కోన్నారు. సోమవారం పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకానిలో 43.7°C గరిష్ఠ ఉష్ణోగ్రత, 17 జిల్లాల్లో 41°Cకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు వెల్లడించారు.

మంగళవారం (13-05-25) 42°C- 43.5°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం-4, విజయనగరం-2, పార్వతీపురంమన్యం-11, కాకినాడ -3, తూర్పుగోదావరి-1 మండలాల్లో తీవ్రవడగాలులు(21), మరో 32 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపారు. బుధవారం 22 మండలాల్లో తీవ్ర, 36 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. గురువారం రాష్ట్రంలో మోస్తారు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు.

మంగళవారం శ్రీకాకుళం-2, విజయనగరం-14, పార్వతీపురంమన్యం-2, అల్లూరి సీతారామరాజు-3, కాకినాడ-4, తూర్పుగోదావరి-7 మండలాల్లో వడగాలులు(32) వీచే అవకాశం ఉందన్నారు..

వడగాలులు వీచే మండలాల వివరాల కోసం డైరెక్ట్‌గా ఈ లింకును క్లిక్ చేయండి..

సోమవారం పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకానిలో 43.7°C, బాపట్ల జిల్లా ఇంకొల్లులో 43.5°C, ప్రకాశం జిల్లా జువ్విగుంటలో 43.3°C, ఎన్టీఆర్ జిల్లా మొగులూరులో 43.1°C, తూర్పుగోదావరి జిల్లా చిట్యాల 42.8°C, ఏలూరులో 42.6°C, విజయనగరం జిల్లా ధర్మవరంలో 42.5°C, తిరుపతి జిల్లా గూడూరు 42.3°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. పల్నాడు 21 ప్రాంతాల్లో, ఎన్టీఆర్ 15, ప్రకాశం 12, బాపట్ల 9, గుంటూరు 8 సహా ఇతర చోట్ల కలిపి 116 ప్రాంతాల్లో 41°C కు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు వివరించారు.

ఎండలో బయటకు వెళ్లేప్పుడు నెత్తికి టోపి పెట్టుకోండి లేదా రూమాలు కట్టుకోండి, తెలుపురంగు గల కాటన్ వస్త్రాలను ధరించండి. అదేవిధంగా మీ కళ్ళ రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించండి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని సూచించారు.

పిడుగులతో కూడిన వర్షాలు..

మరోవైపు రేపు రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పిడుగులు, ఈదురుగాలులు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..