AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం… కానీ

బంద్ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు (సెప్టెంబర్ 27) నిర్వహించాల్సిన పలు ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం(సెప్టెంబర్ 27) పాఠశాలలకు ఏపీ సర్కార్ సెలవు ప్రకటించింది.

Andhra Pradesh: నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం... కానీ
Ap Schools
Ram Naramaneni
|

Updated on: Sep 27, 2021 | 11:07 AM

Share

రాష్ట్రవ్యాప్తంగా సోమవారం(సెప్టెంబర్ 27) పాఠశాలలకు ఏపీ సర్కార్ సెలవు ప్రకటించింది. సోమవారం నాటి భారత్‌బంద్‌కు మద్దతివ్వాలన్న ఉపాధ్యాయ సంఘాల సూచనతో సెలవు ప్రకటించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు  విద్యాశాఖ అధికారులకు విద్యాశాఖ మంత్రి సురేశ్‌ ఆదేశాలు జారీ చేశారు. అయితే నేటి సెలవుకు ప్రత్యామ్నాయంగా మరో రోజు పనిదినం ఉంటుందని మంత్రి సురేశ్‌ తెలిపారు. 

పలు పరీక్షలు వాయిదా…

బంద్ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు (సెప్టెంబర్ 27) నిర్వహించాల్సిన పలు ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. నేడు నిర్వహించాల్సిన ఏపీ స్టడీ సర్కిల్ ఎంట్రన్స్ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ జేడీ ప్రకటించారు. భారత్ బంద్ వల్ల స్టడీ సర్కిల్ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. ఎగ్జామ్ తిరిగి ఎప్పుడు నిర్వహించాలనే తేదీని త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. భారత్ బంద్ నేపథ్యంలో నేడు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించాల్సిన ఎంసీఏ, ఎంబీఏ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ మిరియాల రమేష్  తెలిపారు. ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహిస్తామనే తేదీలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 27న భారత్‌ బంద్‌ నిర్వహించాలని జాతీయ రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ఈ భారత్‌ బంద్‌కు ఏపీ సర్కార్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఖండిస్తూ చేపడుతున్న ఉద్యమంలో అంతా శాంతియుతంగా నిరసన తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయొద్దని, 3  రైతు చట్టాలు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి పేర్ని నాని కోరారు. ఈ బంద్‌లో ఆర్టీసీ కూడా మధ్యాహ్నం వరకూ పాల్గొననుంది. టీడీపీతో పాటు సీపీఐ, సీపీఎం పార్టీలు భారత్ బంద్​కు మద్దతిచ్చాయి. బంద్ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది.

Also Read:  అనంతపురం జిల్లాలో బంగారం నిక్షేపాలు.. టన్ను మట్టి తవ్వితీస్తే 4 గ్రాముల గోల్డ్

వరుడు తాళి కడుతుంటే.. మంగళ సూత్రం విసిరికొట్టిన వధువు

Follow Us
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్