AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు అప్పుడే.. ఇకపై నో వెయిటింగ్..

దీపం పథకంపై ఏపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. నిధులు ఎప్పుడు జమ చేస్తామనే విషయంపై క్లారిటీ ఇవ్వనుంది. ఇప్పటివరకు గ్యాస్ డెలివరీ అయిన తర్వాత అకౌంట్లో డబ్బులు ఎప్పుడు పడతాయనేది అర్థం కాక లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు దీనిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దమైంది.

Andhra Pradesh: ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు అప్పుడే.. ఇకపై నో వెయిటింగ్..
Deepam Scheme
Venkatrao Lella
|

Updated on: Sep 18, 2026 | 10:28 AM

Share

ఏపీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్ తెలిపింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీపం-2 పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ కింద రేషన్ కార్డు కలిగి ఉన్న పేదలంరికీ ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తోంది. ముందుగా లబ్దిదారుడు సిలిండర్ బుక్ చేసుకుని పేమెంట్ చేయాల్సి ఉంటుంది. గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన తర్వాత ప్రభుత్వం రాయితీ నిధులను లబ్దిదారుడి బ్యాంక్ ఖాతాల్లో కొన్ని రోజులకు జమ చేస్తుంది. అయితే ఈ డబ్బులు ఎప్పుడు అకౌంట్లో పడతాయో తెలియక లబ్దిదారులు సతమతమవుతున్నారు. వాటి కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సి వస్తోంది. దీంతో నిధుల జమకు ఒక ఫిక్స్‌డ్ షెడ్యూల్‌ను నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రతిపాదనపై పౌరసరఫరాలశాఖ అధికారులు చర్చిస్తున్నారు.

లబ్దిదారుడుకి గ్యాస్ డెలివరీ అయిన తర్వాత నెలలో నిర్ణీత తేదీకి డబ్బులను జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఒకవేళ సెప్టెంబర్ నెలలో గ్యాస్ తీసుకుంటే అక్టోబర్‌లో నిర్ణీత తేదీలో నిధులు జమ అవుతాయి. దీంతో ఆ తేదీన బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే డబ్బులు పడ్డాయో.. లేదో తెలుస్తుంది. ఇందుకోసం ఎప్పుడు పడతాయనేది రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పని ఉండదు. ఏ తేదీన అకౌంట్లో పడతాయనేది ప్రభుత్వం ముందుగానే డేట్ ఫిక్స్ చేస్తుంది. దీంతో ఆ రోజు అకౌంట్లో పడతాయి. లబ్దిదారులు డబ్బుల కోసం ఎదురుచూడాల్సిన బాధ తప్పుతుంది. ప్రస్తుతం తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ లాంటి పథకాల డబ్బులు అకౌంట్లో ఎప్పుడు వేస్తారనేది ముందు చెబుతున్నారు. అదే విధానాన్ని ఇప్పుడు దీపం-2 పథకానికి కూడా అమలు చేయనున్నారు. దీని వల్ల లబ్దిదారులకు ముందే ఒక క్లారిటీ వస్తుంది.

ప్రస్తుతం ఏడాదికి మూడు సిలిండర్లకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున పంపిణీ చేస్తోంది. ఏప్రిల్ నుంచి జులై వరకు ఒకటి, ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు మరొకటి, డిసెంబర్ నుంచి మార్చి వరకు ఒక సిలిండర్ చొప్పున ఇస్తోంది. 2024 అక్టోబర్ 31న ఈ స్కీమ్ ప్రారంభమైంది. రేషన్ కార్డు కలిగి ఉన్న పేదలకు ఈ పథకం వర్తింపచేస్తున్నారు. అయితే ఇక కొంతమంది లబ్దిదారులకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉండటంతో.. ఎందులో పడతాయనేది అర్థం కావడం లేదు. ఈ సమస్యలను గుర్తించిన ప్రభుత్వం.. ముందుగా ఫిక్స్ చేసిన తేదీ ప్రకారం డబ్బులు వేయనుంది. దీంతో లబ్దిదారులు చెక్ చేసుకోవడానికి కూడా సులువుగా ఉంటుంది.

Follow Us
ఉచిత గ్యాస్ సిలిండర్ల లబ్దిదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల లబ్దిదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ముంచుకొస్తున్న కొత్త తుఫాన్! తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!
ముంచుకొస్తున్న కొత్త తుఫాన్! తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!
థియేటర్లను షేక్ చేసిన సినిమా.. ఇప్పటికీ తగ్గని డిమాండ్..
థియేటర్లను షేక్ చేసిన సినిమా.. ఇప్పటికీ తగ్గని డిమాండ్..
వినాయకచవితి ప్రసాదం.. కిలో బియ్యంతో టేస్టీ టొమాటో రైస్ ఇలా చేయండి
వినాయకచవితి ప్రసాదం.. కిలో బియ్యంతో టేస్టీ టొమాటో రైస్ ఇలా చేయండి
గణేశుడిని విందుకు పిలిచిన కుబేరుడు.. ఆ తర్వాత జరిగినది ఊహించలేరు!
గణేశుడిని విందుకు పిలిచిన కుబేరుడు.. ఆ తర్వాత జరిగినది ఊహించలేరు!
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
మీరు Flipkartలో ఎక్కువగా షాపింగ్‌ చేస్తారా? మీకో భారీ గుడ్‌న్యూస్
మీరు Flipkartలో ఎక్కువగా షాపింగ్‌ చేస్తారా? మీకో భారీ గుడ్‌న్యూస్
సౌందర్య ఇంటి ఎంట్రన్స్ లో అది చూడగానే తట్టుకోలేకపోయా..
సౌందర్య ఇంటి ఎంట్రన్స్ లో అది చూడగానే తట్టుకోలేకపోయా..
గణేష్ మండపాల నిర్వాహకులకు గుడ్ న్యూస్.. డీజేలపై ఏపీ సర్కార్ కీలక
గణేష్ మండపాల నిర్వాహకులకు గుడ్ న్యూస్.. డీజేలపై ఏపీ సర్కార్ కీలక
రైతన్నలకు బిగ్‌ అలర్ట్.. ఇలా చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు రానట్టే
రైతన్నలకు బిగ్‌ అలర్ట్.. ఇలా చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు రానట్టే