AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో టెన్త్ రిజల్ట్స్ విషయంలో సర్కార్ కీలక నిర్ణయం.. గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు రద్దు

100కు 99 మార్కులు.. 100కు 98 మార్కులు.. 100కు 95 మార్కులు... ఈ పదాలను.. ప్రచారాన్ని విని చాలా సంవత్సరాలు అయింది కదా..

Andhra Pradesh: ఏపీలో టెన్త్ రిజల్ట్స్ విషయంలో సర్కార్ కీలక నిర్ణయం.. గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు రద్దు
Ap Tenth Results
Ram Naramaneni
|

Updated on: Aug 28, 2021 | 1:24 PM

Share

100కు 99 మార్కులు.. 100కు 98 మార్కులు.. 100కు 95 మార్కులు… ఈ పదాలను.. ప్రచారాన్ని విని చాలా సంవత్సరాలు అయింది కదా.. ఇక నుంచి ప్రతి సంవత్సరం మళ్లీ వినపడబోతున్నాయి. మార్కుల హడావుడీ.. మళ్లీ షురూ కాబోతోంది. ఏపీలో పదో తరగతి ఫలితాల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్ల స్థానంలో మళ్లీ మార్కుల విధానాన్ని తీసుకొస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

విద్యార్ధులపై ఒత్తిడి పెరుగుతుందన్న ఉద్దేశంతో.. 2010లో అప్పటి ప్రభుత్వం గ్రేడింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే ఎక్కువ మందికి ఒకే గ్రేడ్లు వచ్చినప్పుడు.. నియామకాల సమయంలో విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నట్టు ప్రభుత్వం భావిస్తోంది. దీంతో గ్రేడ్ల స్థానంలో మార్కులు ఇవ్వాలని నిర్ణయించింది. 2019 మార్చి వరకు విద్యార్థులకు గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు ఇస్తారు. 2020 మార్చి నుంచి మార్కులు కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

కరోనా కారణంగా గత రెండేళ్లుగా పరీక్షలను నిర్వహించలేదు. ఈ ఏడాది ఇంటర్‌ ప్రవేశాలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పదో తరగతిలో గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు ఉన్నందున సీట్ల కేటాయింపు కష్టంగా మారింది. దీంతో అంతర్గతంగా ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి మార్కులను తీసుకొని, ఆన్‌లైన్‌ ప్రవేశాలు నిర్వహించాలని మొదట భావించారు. విద్యార్థులకు మార్కులు ఇవ్వకుండా ఇంటర్‌ విద్యామండలికి ఇస్తే న్యాయ వివాదాలు వస్తాయని పరీక్షల విభాగం వెల్లడించింది. దీంతో ప్రభుత్వం గ్రేడింగ్‌ వ్యవస్థనే రద్దు చేసింది. తిరిగి మార్కుల విధానాన్ని తీసుకొచ్చింది.

Also Read: మహిమలున్న శంఖమట.. బ్యాటరీతో చిన్న ట్రిక్ ప్లే చేసి.. ఏకంగా రెండు కోట్లు కొల్లగొట్టాడు

వైరస్ టెర్రర్.. ప్రకాశం జిల్లా పాఠశాలల్లో 76 మందికి కరోనా