AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: చారిత్రాత్మక కార్యక్రమానికి మేం వస్తున్నాం.. విపక్షాల తీరును తప్పుపట్టిన సీఎం జగన్..

నూతన పార్లమెంటు భవనం ప్రారంభంపై సీఎం జగన్‌ ట్వీట్ చేశారు. రాజకీయ విభేదాలన్నింటినీ పక్కనపెట్టి, ఈ మహత్తర కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు హాజరుకావాలని కోరుతున్నాను. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి వైసీపీ హాజరవుతుందని ట్విట్టర్‌లో సీఎం జగన్ పేర్కొన్నారు.

CM Jagan: చారిత్రాత్మక కార్యక్రమానికి మేం వస్తున్నాం.. విపక్షాల తీరును తప్పుపట్టిన సీఎం జగన్..
CM Jagan On New Parliament
Sanjay Kasula
|

Updated on: May 24, 2023 | 9:17 PM

Share

కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని 20 విపక్షాల నిర్ణయాన్ని వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారు. నూతన పార్లమెంటు భవనం ప్రారంభంపై సీఎం జగన్‌ ట్వీట్ చేశారు. రాజకీయ విభేదాలన్నింటినీ పక్కనపెట్టి, ఈ మహత్తర కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు హాజరుకావాలని కోరుతున్నాను. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి వైసీపీ హాజరవుతుందని ట్విట్టర్‌లో సీఎం జగన్ పేర్కొన్నారు. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేయబోతున్న ప్రధాని మోదీకి సీఎం జగన్ అభినందనలు తెలిపారు.

‘పార్లమెంటు అనేది ప్రజాస్వామ్య దేవాలయం. అది మన దేశం యొక్క ఆత్మను ప్రతిబింబిస్తుంది. అది మన దేశ ప్రజలకే కాదు, అన్ని రాజకీయ పార్టీలకు చెందినది. ఇలాంటి శుభకార్యక్రమాన్ని బహిష్కరించడం నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదు. రాజకీయ విభేదాలన్నింటినీ పక్కనపెట్టి, ఈ మహత్తర కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు హాజరుకావాలని కోరుతున్నాను. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి వైసీపీ హాజరవుతుంది’’ అని ట్విట్టర్‌లో సీఎం జగన్ పేర్కొన్నారు.

కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవంపై రగడ కొనసాగుతోంది. ఈనెల 28వ తేదీన కొత్త పార్లమెంట్‌ను ప్రారంభించబోతున్నారు ప్రధాని మోదీ. అయితే ప్రధాని కాకుండా రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పార్లమెంట్‌ను ప్రారంభించాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. పార్లమెంట్‌ ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తునట్టు 19 పార్టీలు లేఖను విడుదల చేశాయి. కొత్త పార్లమెంట్‌ను స్పీకర్‌ ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తున్నారు మజ్లిస్‌ అధినేత ఒవైసీ. ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని విపక్షాలు నిర్ణయించడం మంచి పరిణామమన్నారు ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం