AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kurnool: పెళ్లయిన 3 రోజులకే ప్రియుడితో వధువు ఎస్కేప్.. ఆ తర్వాత ఊహించని సీన్

మరో ప్రేమ పెళ్లి వివాదాస్పదంగా మారింది. ఓ ఇద్దరు యువతి, యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే కారణంగా రెండు కుటుంబాల మధ్య వైరం పెరిగింది. అది కాస్త ఇప్పుడు ఏకంగా ఊరు ఊరినే టెన్షన్‌లో పడేసింది.

Kurnool: పెళ్లయిన 3 రోజులకే ప్రియుడితో వధువు ఎస్కేప్.. ఆ తర్వాత ఊహించని సీన్
Bride
Jyothi Gadda
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 13, 2022 | 6:46 PM

Share

మరో ప్రేమ పెళ్లి వివాదాస్పదంగా మారింది. ఓ ఇద్దరు యువతి, యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే కారణంగా రెండు కుటుంబాల మధ్య వైరం పెరిగింది. అది కాస్త ఇప్పుడు ఏకంగా ఊరు ఊరినే టెన్షన్‌లో పడేసింది. కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఘోరం జ‌రిగింది. మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెల‌కొంది. ప్రేమ పెళ్లి కారణంగా రెండు వర్గాల మధ్య వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలోనే ప్రేమించిన యువకుడి ఇంటికి యువతి బంధువులు నిప్పు పెట్టారు.

మాధవరం గ్రామానికి చెందిన బోయ శ్రీజ రచ్చమర్రి గ్రామానికి చెందిన భీమ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలోనే జూన్‌ ఈ నెల 9వ తేదిన వివాహం చేసుకున్నారు. అయితే, వీరి పెళ్లికి అంగీకరించని ఆ యువతి బంధువులు దాడిచేస్తారని భ‌య‌ప‌డి యువకుడి ఇంటిపాలిది ఇంటినుంచి పారిపోయారు. దీంతో కోపోద్రిక్తులైన యువ‌తి బంధువులు అత‌ని ఇంటికి నిప్పంటించారు. ఇంట్లో ఉన్న బట్టలు,బియ్యం వంటసామాగ్రి పూర్తిగా కాలిబూడిదయ్యాయి. దీంతో గ్రామాంలో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించారు. మాధవరంలో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి